కోవిడ్-19 సాకుతో క్వశ్చన్ అవర్ రద్దు చేస్తారా ? విపక్షాల ఆగ్రహం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కోవిడ్-19 సాకుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కోవిడ్-19 సాకుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, టీఎంసి ఎంపీ డెరెక్ ఓ బ్రీన్ తమ ట్వీట్లలో ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతూ.. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. పార్లమెంటును ప్రభుత్వం ఓ నోటీసు బోర్డు స్థాయికి దిగజార్చిందని, లోక్ సభ మెజారిటీని రబ్బర్ స్టాంప్ లా వినియోగించుకోజూస్తున్నదని శశిథరూర్ అన్నారు. మా ఎంపీలను సురక్షితంగా ఉంచుతున్నామనే నెపంపై ఈ చర్య తీసుకోవడమేమిటని డెరెక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడమంటే ప్రభుత్వాన్ని మేం ప్రశ్నలు అడగరాదన్నదేనని స్పష్టమవుతోందన్నారు.
1/2 I said four months ago that strongmen leaders would use the excuse of the pandemic to stifle democracy&dissent. The notification for the delayed Parliament session blandly announces there will be no Question Hour. How can this be justified in the name of keeping us safe?
— Shashi Tharoor (@ShashiTharoor) September 2, 2020
MPs required to submit Qs for Question Hour in #Parliament 15 days in advance. Session starts 14 Sept. So Q Hour cancelled ? Oppn MPs lose right to Q govt. A first since 1950 ? Parliament overall working hours remain same so why cancel Q Hour?Pandemic excuse to murder democracy
— Derek O’Brien | ডেরেক ও’ব্রায়েন (@derekobrienmp) September 2, 2020