Nipah Virus: పెరుగుతున్న నిఫా వైరస్ మరణాలు.. అక్కడ విద్యా సంస్థలకు రెండ్రోజుల సెలవు..

|

Sep 14, 2023 | 1:21 PM

Nipah Virus: రాష్ట్రంలో మొత్తం 706 మంది వైరస్ కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే ఉండడం విశేషం. అలాగే వీరిలో 77 మంది హైరిస్క్‌లో ఉండగా.. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైరస్ కేసుల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని జార్జ్ సూచించారు. ఇంకా తేలికపాటి లక్షణాలతో..

Nipah Virus: పెరుగుతున్న నిఫా వైరస్ మరణాలు.. అక్కడ విద్యా సంస్థలకు రెండ్రోజుల సెలవు..
Nipah Virus In Kerala
Follow us on

Nipah Virus: కేరళలోని పలు ప్రాంతాల్లో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే నలుగురు మరణించగా.. తాజాగా కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరో వ్యక్తి  నిఫా వైరస్‌తో చనిపోయాడు. దీంతో నిఫా వైరస్‌ నివారణ కోసం స్థానిక విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు గురు, శుక్రవారాల్లో విద్యాసంస్థలకు సెలవు అని తెలియజేస్తూ కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఎ గీత ఫేస్‌బుక్ పోస్ట్‌ చేశారు. కావాలంటే ఈ రెండు రోజుల్లో ఆన్‌లైన్ క్లాసెస్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కానీ యూనివర్సిటీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆమె తెలిపారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 706 మంది వైరస్ కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే ఉండడం విశేషం. అలాగే వీరిలో 77 మంది హైరిస్క్‌లో ఉండగా.. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైరస్ కేసుల నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని జార్జ్ సూచించారు. ఇంకా తేలికపాటి లక్షణాలతో ఉన్న మరో 13 మందిని ఇప్పుడు ఆసుపత్రిలో పర్యవేక్షిస్తున్నారని, వైరస్ సోకిన వారిలో 9 ఏళ్ల చిన్నారి మాత్రమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉందని ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

నిఫా వ్యాధి లక్షణాలివే..

నిఫా వైరస్‌ అనేది డేట్‌పామ్‌ చెట్ల పండ్లపై ఆధారపడే ఫ్రూట్‌ బ్యాట్స్‌ నుంచి మనుషులకు వ్యాపించే నిఫా వైరస్‌. ఇక ఈ వ్యాధి ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్‌ కలిగించి, ఎన్‌సెఫలోపతికి దారి తీస్తుంది. అందుకే నిఫా వైరస్‌ని తొలుత మెదడువాపుగా భావించారు. ఇక నిఫా వైరస్‌ సొకినవారికి యావరేజ్‌గా 9 రోజుల్లో లేదా 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో వైరస్ సోకినవారు తీవ్రమైన తలనొప్పితో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..