కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో 9 మంది అల్-ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

| Edited By: Anil kumar poka

Sep 19, 2020 | 10:30 AM

కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 9 మంది అల్-ఖైదా ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ శనివారం అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్, కేరళ లోని ఎర్నాకులం జిల్లాల్లో వీరు పట్టుబడ్డారు.

కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో 9 మంది అల్-ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
Follow us on

కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 9 మంది అల్-ఖైదా ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ శనివారం అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్, కేరళ లోని ఎర్నాకులం జిల్లాల్లో వీరు పట్టుబడ్డారు. అమాయక ప్రజలను హతమార్చి ప్రజల్లో భయాందోళన రేకెత్తించేందుకు వీరు కుట్ర పన్నారని తెలుస్తోంది. వీరిలో ముగ్గురిని ఎర్నాకుళంలో. మిగిలినవారిని ముర్షీదాబాద్ లో అరెస్టు చేశారు. వీరి నుంచి డిజిటల్ పరికరాలు, జిహాదీ సాహిత్యం, పదునైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి వినియోగించే లిటరేచర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఢిల్లీకి తరలించి కోర్టులో హాజరు పరచనున్నారు.