Crime News: యూపీలో దారుణం.. నర్సు నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి..

|

Apr 27, 2022 | 7:21 AM

A newborn child died: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. నర్సు నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతిచెందింది. నర్సు చేతిలోంచి జారి అప్పుడే పుట్టిన శిశువు

Crime News: యూపీలో దారుణం.. నర్సు నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి..
Follow us on

A newborn child died: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. నర్సు నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతిచెందింది. నర్సు చేతిలోంచి జారి అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందిన ఘటన లక్నో (Lucknow) చిన్‌హట్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో టవల్‌ సాయం లేకుండా శిశువును నర్సు ఒంటి చేత్తో ఎత్తుకుంది. ఈ క్రమంలో శిశువు జారి కిందపడ్డాడు. దీంతో తలకు గాయమై మృతిచెందాడు. ఇది చూసిన తల్లి గట్టిగా కేకలు పెడుతూ రోదించింది. ఈ సమయంలో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో వారంతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ లోపలికి వెళ్లారు.

ఈ సమయంలో మహిళకు మృత శిశువు జన్మించినట్లు ఆసుపత్రి సిబ్బంది బుకాయించే ప్రయత్నం చేశారు. శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు ఒంటి చేతితో పట్టుకోవడంతో కిందపడి మృతి చెందినట్లు సదరు తల్లి చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు చిన్‌హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు నివేదికలో సైతం వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

PM Modi: పెరుగుతోన్న కరోనా కేసులు.. నేడు ముఖ్యమంత్రులతో పీఎం మోదీ కీలక సమావేశం..

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగిందా..? సింపుల్‌ ఇలా తెలుసుకోండి