LK Advani: ఎల్‌కే అద్వానీని భారతరత్నతో సత్కరించడంపై వెల్లువెత్తుతున్న ప్రముఖుల అభినందనలు

లాల్ కృష్ణ అద్వానీకి ఎట్టకేలకు భారతరత్న లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ తన గురు రుణాన్ని ఈ విధంగా చెల్లించారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నందుకు అభినందనలు తెలిపారు.

LK Advani: ఎల్‌కే అద్వానీని భారతరత్నతో సత్కరించడంపై వెల్లువెత్తుతున్న ప్రముఖుల అభినందనలు
Lk Advani Narendra Modi

Updated on: Feb 04, 2024 | 12:07 PM

భారత జనతా పార్టీ సహా వ్యవస్థాపకులు లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 3న వెల్లడించారు. బీజేపీని అట్టడుగు స్థాయి నుంచి అధికార పీఠం ఎక్కించడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు అద్వానీ. ఆయన చరిష్మా వల్లనే 1989 లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ 85 సీట్లు గెలుచుకుంది. దీంతో లాల్ కృష్ణ అద్వానీకి ఎట్టకేలకు భారతరత్న లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ తన గురు రుణాన్ని ఈ విధంగా చెల్లించారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈక్రమంలోనే లాల్ కృష్ణ అద్వానీని భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, నానాజీ దేశ్‌ముఖ్, ఎల్‌కె అద్వానీలతో కలిసి పనిచేయడం తన గొప్ప అదృష్టమని మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు. లాల్‌కృష్ణ అద్వానీని భారతరత్నతో సత్కరించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు మనోహర్ జోషి. భారతరత్న అటల్‌జీ, భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్‌, భారతరత్న అద్వానీజీలతో 60 ఏళ్లకు పైగా పనిచేసే అవకాశం రావడం అదృష్టం అని మురళీ మనోహర్ జోషి అన్నారు.

‘భారతరత్న’ను అత్యంత వినమ్రతతో స్వీకరిస్తున్నట్లు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఒక ప్రకటనలో తెలిపారు. “అత్యంత వినయం, కృతజ్ఞతతో ‘భారతరత్న’ను అంగీకరిస్తున్నాను. ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు, నా జీవితాంతం నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలకు, సూత్రాలకు గౌరవం’ అని అద్వానీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇతర నేతలు ఎలా స్పందించారు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల్లో ఆనందాన్ని నింపిందని నడ్డా అన్నారు. అద్వానీకి భారతరత్న ప్రదానం చేసినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి డోయెన్ తన పార్లమెంటరీ, పరిపాలనా సామర్థ్యాల ద్వారా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని అన్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అద్వానీ అభినందించారు, అతను అందరికీ స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు.

అలాగే ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అద్వానీకి తన శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన దీర్ఘాయువు కోసం ప్రార్థించారు. దేశాభివృద్ధికి అద్వానీ అమూల్యమైన కృషి చేశారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. “భారత మాజీ ఉప ప్రధానమంత్రి మరియు సీనియర్ నాయకుడు, ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించడం ఆనందంగా ఉంది. దేశ అభివృద్ధికి ఆయన విలువైన కృషి చేశారు. హృదయపూర్వక అభినందనలు” అని పవార్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభినందనలు తెలిపారు. టెలిఫోన్‌లో అతనికి అభినందనలు తెలియజేసారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన కింద పనిచేసే అవకాశం నాకు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ అద్వానీ అభిమానాన్ని పొందుతాను, ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం కూడా పొందాను అంటూ వెల్లడించారు నితీష్ కుమార్.

ఆద్వానీకి రాజస్థాన్ సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, శర్మ ట్విట్టర్ ‘X’ లో ఇలా రాశారు, భారత ప్రజాస్వాం అద్భుతమైన సంప్రదాయాలకు బలమైన కండక్టర్, బిజెపి కుటుంబానికి బలమైన మూలస్తంభం, తీవ్రమైన జాతీయవాది, ప్రముఖ ప్రజా నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, “భారతరత్న”తో సత్కరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us