మైసూర్ ప్యాలెస్‌కు ఓ వింత సమస్య.. భవనాన్ని పాడుచేస్తున్న పావురాల రెట్టలు..

|

Jun 28, 2024 | 12:16 PM

పావురాల రెట్టలు ఏదైనా రాగి లేదా స్టీలు పాత్రలో వేసి కొన్ని రోజులు ఉంచితే అవి రంధ్రం పడిపోతాయని చెప్పారు. అదే విధంగా పాలరాతితో నిర్మించిన చోట పావురాల రెట్టలు వేయడంతో ఆ పాలరాయి దెబ్బతింటుంది. కనుక ఈ రెట్టలు ప్యాలెస్‌కు చాలా హాని కలిగిస్తాయని ఆయన అన్నారు. మైసూర్‌లోని పదవ చామరాజ సర్కిల్, నాల్గవ కృష్ణరాజ సర్కిల్ పాలరాయితో నిర్మించబడ్డాయి. ఈ సర్కిల్ కు ఇప్పుడు పావురాలు తమకు తెలియకుండానే హాని చేస్తున్నాయి.

మైసూర్ ప్యాలెస్‌కు ఓ వింత సమస్య.. భవనాన్ని పాడుచేస్తున్న పావురాల రెట్టలు..
Mysuru Palace
Follow us on

సాంస్కృతిక నగరం మైసూర్ లో చారిత్రాత్మక ప్యాలెస్, రాజ నివాసం మైసూర్ ప్యాలెస్‌తో చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూర్ ప్యాలెస్ కు ఓ వింత సమస్య వచ్చింది. ఈ రాజ నివాసం పావురాల రెట్టలతో తడిసిపోతోంది. దీంతో భవనం నిర్మాణం దెబ్బతింటుందని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పావురం రెట్టలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉన్న ఈ పావురాల రెట్టలు హెరిటేజ్ భవనాలపై పడటం వల్ల భవనం దెబ్బతింటుందని చరిత్రకారుడు ప్రొ. రంగారావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ప్రొ. రంగారావు టీవీ9 డిజిటల్‌తో మాట్లాడుతూ పావురాల రెట్టలు ఏదైనా రాగి లేదా స్టీలు పాత్రలో వేసి కొన్ని రోజులు ఉంచితే అవి రంధ్రం పడిపోతాయని చెప్పారు. అదే విధంగా పాలరాతితో నిర్మించిన చోట పావురాల రెట్టలు వేయడంతో ఆ పాలరాయి దెబ్బతింటుంది. కనుక ఈ రెట్టలు ప్యాలెస్‌కు చాలా హాని కలిగిస్తాయని ఆయన అన్నారు. మైసూర్‌లోని పదవ చామరాజ సర్కిల్, నాల్గవ కృష్ణరాజ సర్కిల్ పాలరాయితో నిర్మించబడ్డాయి. ఈ సర్కిల్ కు ఇప్పుడు పావురాలు తమకు తెలియకుండానే హాని చేస్తున్నాయి.

కనుక ప్యాలెస్ లోని ఈ సర్కిల్‌ల దగ్గర పావురాలు రాకుండా నిరోధించాలని చెప్పారు. ఈ విషయంపై ఆయన తన గొంతు వినిపిస్తూ అధికారులను హెచ్చరిస్తున్నారు కూడా. ఇప్పుడు పావురాలను రాజభవనాలు, రాజుల సర్కిల్‌లకు దూరంగా ఉంచాలనే డిమాండ్ ఊపు అందుకుంది. పావురాలు ప్యాలెస్ కు దూరంగా వెళ్లాలంటే.. తిండి గింజలు వేయడం నిలిపివేయాలని సూచించారు. కొంతమంది ప్యాలెస్ చుట్టూ ఉన్న పావురాలకు ఆహారంగా ధ్యానాన్ని అందించడానికి ధాన్యాన్ని అమ్మడం మొదలు పెట్టారని.. ఇక నుంచి ఈ అమ్మకాలు జరగకుండా అరికట్టాలని సూచిస్తున్నారు. వారసత్వ కట్టడాన్ని పరిరక్షించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

పావురాలకు ఆహారాన్ని అందించడం నిలిపివేయాలి: కలెక్టర్

ఈ విషయమపై మైసూరు జిల్లా కలెక్టర్ డా. కేవీ రాజేంద్ర స్పందిస్తూ ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర పావురాలకు గోధుమలు, మొక్కజొన్న, ధాన్యాన్ని అమ్ముతున్నారు. పర్యాటకులు, ప్రజలు కూడా భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి పావురాలకి అందిస్తున్నారు. దీంతో ప్యాలెస్ చుట్టూ పావురాలు నివసించడం ఎక్కువ అయింది. పావురాలు ప్యాలెస్ బిల్డింగ్ అంతా రెట్టలు వేసి పాడు చేస్తున్నాయి. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సాంస్కృతిక భవనం అందాన్ని కోల్పోతుంది. కనుక ఇప్పటికైనా దీనిని అరికట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
పావురాలను రెట్టలు ప్రమాదకరమని హెరిటేజ్ నిపుణులు, పర్యావరణవేత్తలు తెలిపారు. అయితే పావురాల ఆనందానికి అంతరాయం కలగకుండా పర్యాటకులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా. కేవీ రాజేంద్ర సూచించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..