AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పైనుంచి చూస్తే పత్తి చేనే.. లోపలికి వెళ్లి తనిఖీలు చేసి.. కంగుతిన్న పోలీసులు

అక్రమార్కులు రోజురోజుకు అప్‌డేట్ అవుతున్నారు. క్రైమ్ చేయడానికి కూడా క్రియేటివిటీ వాడుతున్నారు. ఇవే తెలివితేటలు మంచి పనుల కోసం వాడరు ఎందుకో....

Viral: పైనుంచి చూస్తే పత్తి చేనే.. లోపలికి వెళ్లి తనిఖీలు చేసి.. కంగుతిన్న పోలీసులు
Cotton Field (Representative image)
Ram Naramaneni
|

Updated on: Nov 21, 2022 | 5:43 PM

Share

మత్తు చిత్తు చేస్తుంది. యువతీయువకులు జీవితాలను బలి తీసుకుంటుంది. ముఖ్యంగా గంజాయి ప్రజంట్ అందరికీ ఈజీగా దొరకుతుంది. ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నా.. అక్రమార్కులు మాత్రం తమ మార్క్ క్రియేటివిటీ ఉపయోగిస్తూ గంజాయి అక్రమ సాగు, రవాణా చేస్తున్నారు. అందుకు అటవీ, ఏజెన్సీ ప్రాంతాలను ఎన్నుకుంటున్నారు. గిరిపుత్రులకు డబ్బులు ఎర చూపి.. వారిని పావులుగా చేసుకుని దందా నడుపుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ధర్ జిల్లాలోని మనవార్ పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇక్కడ గంజాయి సాగు కోసం.. పత్తి చేనును ఎన్నుకున్నాడు నిందితుడు. పొలం మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా పెంపకం షురూ చేశాడు. కానీ ఇన్‌ఫార్మర్ ద్వారా పోలీసులకు సమాచారం అందండంతో బాగోతం బయటపడింది.

పత్తి పొలంపై దాడి చేసి ఎగుమతికి సిద్దంగా ఉంచిన 105 కిలోల బరువున్న 44 గంజాయి బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు మనవార్ పోలీసులు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి నీరజ్ బిర్తారే తెలిపారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ గంజాయి సాగును అరికట్టాలని, నిందితులను పట్టుకోవాలని ధార్ ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే హనుమంత్య నయాపురా వద్ద పత్తి పొలంలో అక్రమంగా గంజాయి సాగు జరుగుతోందని సబ్-ఇన్‌స్పెక్టర్ అభిషేక్ జాదవ్ ఇన్‌ఫార్మర్ నుంచి సమాచారం అందించింది. ఈ చేను కువాడ్ నివాసి రమేష్ భిలాలాకు చెందినది.

వెరిఫికేషన్‌ తర్వాత సమాచారం సరైనదని పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 105 కిలోల బరువున్న 44 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతనిపై సెక్షన్ 8/20 NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాడిని ముందుగానే పసిగట్టిన నిందితుడు రమేష్ పారిపోయాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్