AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడిపోయి.. 30 ఏళ్లకు వచ్చి భార్యను చంపిన రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి.. విచారణలో షాకింగ్ నిజాలు..!

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆమెతో దాదాపు 30 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వ్యక్తి, హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.

విడిపోయి.. 30 ఏళ్లకు వచ్చి భార్యను చంపిన రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి.. విచారణలో షాకింగ్ నిజాలు..!
Crime News
Balaraju Goud
|

Updated on: Sep 29, 2025 | 9:46 AM

Share

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆమెతో దాదాపు 30 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వ్యక్తి, హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజీవ్ చంద్రకాంత్, షాలిని దేవి (54) 1993లో వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా 1995 నుండి విడివిడిగా నివసిస్తున్నారని పోలీసు దర్యాప్తులో తేలింది. శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి, రాజీవ్ కొన్ని పత్రాలను సేకరించడానికి పోవాయ్‌లోని తన భార్య ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో షాలినిపై దాడి చేసిన రాజీవ్, దిండుతో ఆమెను ఊపిరాడకుండా చేసి చంపాడు. అనంతరం, నిందితుడు దిండుతో అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. సంఘటన తర్వాత నిందితుడు తన మొబైల్ ఫోన్, కారు కీలను వదిలి పారిపోయాడని డీసీపీ తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఈ వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు ఆధారాలను ఉపయోగించి, పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని డీసీపీ తెలిపారు. అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

విడివిడిగా నివసిస్తున్న తర్వాత కూడా ఈ జంట తరచుగా గొడవపడేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారికి ఆస్తి వివాదం ఉంది. నిందితుడి రాజీవ్ గతంలో ఆ మహిళపై చాలాసార్లు దాడి చేశాడు. రాజీవ్‌ను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు హత్యకు సంబంధించిన వివరాలను మాత్రమే అతను వెల్లడించాడు. విచారణ కొనసాగుతోందన్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?