AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడిపోయి.. 30 ఏళ్లకు వచ్చి భార్యను చంపిన రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి.. విచారణలో షాకింగ్ నిజాలు..!

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆమెతో దాదాపు 30 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వ్యక్తి, హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.

విడిపోయి.. 30 ఏళ్లకు వచ్చి భార్యను చంపిన రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి.. విచారణలో షాకింగ్ నిజాలు..!
Crime News
Balaraju Goud
|

Updated on: Sep 29, 2025 | 9:46 AM

Share

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఉద్యోగి తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆమెతో దాదాపు 30 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వ్యక్తి, హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజీవ్ చంద్రకాంత్, షాలిని దేవి (54) 1993లో వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా 1995 నుండి విడివిడిగా నివసిస్తున్నారని పోలీసు దర్యాప్తులో తేలింది. శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి, రాజీవ్ కొన్ని పత్రాలను సేకరించడానికి పోవాయ్‌లోని తన భార్య ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో షాలినిపై దాడి చేసిన రాజీవ్, దిండుతో ఆమెను ఊపిరాడకుండా చేసి చంపాడు. అనంతరం, నిందితుడు దిండుతో అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. సంఘటన తర్వాత నిందితుడు తన మొబైల్ ఫోన్, కారు కీలను వదిలి పారిపోయాడని డీసీపీ తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఈ వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు ఆధారాలను ఉపయోగించి, పోలీసులు నిందితుడిని పట్టుకోగలిగారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని డీసీపీ తెలిపారు. అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

విడివిడిగా నివసిస్తున్న తర్వాత కూడా ఈ జంట తరచుగా గొడవపడేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారికి ఆస్తి వివాదం ఉంది. నిందితుడి రాజీవ్ గతంలో ఆ మహిళపై చాలాసార్లు దాడి చేశాడు. రాజీవ్‌ను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు హత్యకు సంబంధించిన వివరాలను మాత్రమే అతను వెల్లడించాడు. విచారణ కొనసాగుతోందన్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?