AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో.. అనంత లోకాలకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైసెన్ జిల్లాలో శనివారం (మే 23) ఉదయం ఒక కలచివేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక గ్రామంలోని బావిలో స్నానం చేస్తుండగా, ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు గిరిజన పాఠశాల విద్యార్థినులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో.. అనంత లోకాలకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
Girls Drown Into Well
Balaraju Goud
|

Updated on: May 24, 2026 | 8:45 AM

Share

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైసెన్ జిల్లాలో శనివారం (మే 23) ఉదయం ఒక కలచివేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక గ్రామంలోని బావిలో స్నానం చేస్తుండగా, ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు గిరిజన పాఠశాల విద్యార్థినులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సగౌర్ గ్రామానికి చెందిన హల్కే రామ్ కుమార్తెలు తను (13), ఆమె సోదరి రాధ (12), అలాగే అదే గ్రామానికి చెందిన రామ్‌గోపాల్ కుమార్తె అమృత (12) శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో స్నానం చేయడానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత వేధిస్తుండటంతో, గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగానే బాలికలు తమ ఇళ్లకు దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న సగౌర్ గ్రామ శివార్లలోని ఒక బావి వద్దకు వెళ్లాల్సి వచ్చింది.

బావి వద్దకు చేరుకున్న బాలికలు స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తూ బాలికల్లో ఒకరు బావిలోని లోతైన నీటిలోకి జారిపడిపోయింది. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఆమె ఊపిరాడక కొట్టుమిట్టాడింది. అది గమనించిన మరో బాలిక, తన స్నేహితురాలిని ఎలాగైనా రక్షించాలనే తాపత్రయంతో బావిలోకి దిగింది. దురదృష్టవశాత్తూ, నీటి ఉధృతికి ఆమె కూడా మునిగిపోసాగింది. కొద్దిసేపటికే, వారిద్దరినీ కాపాడే ప్రయత్నంలో మూడో బాలిక కూడా ఏమాత్రం ఆలోచించకుండా బావిలోకి దూకింది. బావిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటం, లోపలి క్లిష్ట పరిస్థితుల కారణంగా ముగ్గురు బాలికలు నీటిలో మునిగిపోయారు.

ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో అమీనా అనే నాల్గవ బాలిక అక్కడే ఉంది. భయంతో వణికిపోయిన ఆమె, వెంటనే గ్రామంలోకి పరుగెత్తుకెళ్లి కుటుంబ సభ్యులను, గ్రామస్తులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. స్థానికులు వెంటనే బావిలోకి దిగి, తీవ్ర శ్రమకోర్చి ముగ్గురు బాలికలను బయటకు తీశారు.

బాలికలను అతికష్టం మీద బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో బాలికలను పరీక్షించిన వైద్యులు వారు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఒకేసారి ముగ్గురు గిరిజన విద్యార్థినులు, అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో సగౌర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. తీవ్ర నీటి కొరత కారణంగానే తమ పిల్లలు ఇంతదూరం వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us