
మధ్యప్రదేశ్లో మద్య నిషేధం మొదటి నుండి పెద్ద సమస్యగా మారింది. దీనిపై అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మద్య నిషేధం అంశం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలు ముగిసిన ఒక సంవత్సరం తర్వాత, రాష్ట్రంలోని మోహన్ యాదవ్ ప్రభుత్వం శుక్రవారం(జనవరి 24) రాష్ట్రంలోని 17 ప్రధాన నగరాల్లో మొదటి దశలో మద్యాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వివరిస్తూ, రాష్ట్రాన్ని మద్య నిషేధ రాష్ట్రంగా మార్చేందుకు తొలి అడుగుపడిందన్నారు. ఇందులో భాగంగా తొలుత 17 మతపరమైన పట్టణాలలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మునిసిపల్ కార్పొరేషన్ ఉజ్జయినితో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ మెహర్, డాటియా, పన్నా, మాండ్లా, ముల్తాయ్, మందసౌర్, నగర పంచాయతీ ఓర్చా, చిత్రకూట్, అమర్కంటక్, మహేశ్వర్, ఓంకారేశ్వర్, మండలేశ్వర్ వంటి నగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు సీఎం చెప్పారు. గ్రామ పంచాయతీలో సల్కాన్పూర్, బండక్పూర్, కుందల్పూర్, బర్మన్ కాలా, లింగ, బర్మన్ ఖుర్ద్ గ్రామాల్లో మద్య నిషేధం విధిస్తున్నట్లు సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు.
మహేశ్వరంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని సీఎం ప్రకటించారు. ఈ సమావేశం గురించి సీఎం మీడియాతో మాట్లాడుతూ.. మద్య నిషేధ నిర్ణయాన్ని వివరిస్తూ.. అయా నగరాలు లేదా గ్రామ పంచాయతీల్లో మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించిన చోట వాటి స్థానంలో ఇతర షాపులు తెరవబోమని చెప్పారు. శాశ్వతంగా మూసివేయడం జరుగుతుందన్నారు.
మద్య నిషేధం ప్రకటించిన చాలా ప్రదేశాలు మత స్థలాలు అని సీఎం అన్నారు. నర్మదా నడి ఒడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మద్యపాన నిషేధం, మునుపటి విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూ దానిని కొనసాగిస్తామన్నారు. ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండదన్న సీఎం.. క్రమంగా రాష్ట్రాలు నిషేధం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..