
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేస్.. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్తో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.. అంతేకాదు.. వారం రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ పరిణామాలు సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో సర్వత్రా చర్చలకు దారితీసింది. ఫలితంగా..ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్ పడింది.. ఆరోపణలు.. ప్రతి ఆరోపణల మద్య రాజకీయాలు మరింత వేడెక్కాయి.
ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు.. వారు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన అరెస్టులను ఒక్కసారి చూడండి..
ఇలా అరెస్టులతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.. కావాలనే కేంద్రం అరెస్టులు జరిపిస్తుందని విపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా. ఈ ఢిల్లీ లిక్కర్ కేసు ఇంకెన్ని మలుపులు తిరిగుతుందో! ఇంకెంతమంది పేర్లు బయటకి వస్తాయో! జైలుకు వెళ్లిన వారు ఎప్పుడు బయటకి వస్తారో! వంటి విషయాలకు ఇప్పుడు హాట్ టాఫిక్గా మారాయి..ఫలితంగా..ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్ పడింది..
మరోవైపు ఇవాళ కవిత క్వాష్ పిటీషన్, కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే, కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. రేపటి వరకూ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఏం చెప్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.