ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్.. చెన్నితాల, మురళీధరన్‌లకు చోటు!

కేరళ రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేరళ కాబోయే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత వి.డి. సతీసన్ ఎంపికయ్యారు. సోమవారం (మే 18, 2026) జరగనున్న నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల పేర్లను సతీసన్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్.. చెన్నితాల, మురళీధరన్‌లకు చోటు!
Kerala Cabinet Announced

Updated on: May 17, 2026 | 9:35 PM

కేరళ రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేరళ కాబోయే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత వి.డి. సతీసన్ ఎంపికయ్యారు. సోమవారం (మే 18, 2026) జరగనున్న నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల పేర్లను సతీసన్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

ఈ కేబినెట్ జాబితాలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు రమేష్ చెన్నితాల, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్, కె. మురళీధరన్ వంటి దిగ్గజాలకు చోటు లభించింది. మంత్రివర్గ ప్రకటనతో పాటు, అసెంబ్లీలోని కీలక పదవులను కూడా యూడీఎఫ్ ఖరారు చేసింది. సీనియర్ శాసనసభ్యుడు తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను కేరళ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నుకోగా, షానిమోల్ ఉస్మాన్ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను, అన్ని వర్గాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కూటమి భాగస్వామ్య పక్షాలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ మంత్రివర్గ జాబితాను సిద్ధం చేసినట్లు సతీసన్ వెల్లడించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ సాధించిన అతిపెద్ద విజయాలలో ఇది ఒకటి అని ఆయన అభివర్ణించారు. పార్టీ ఒంటరిగానే 63 సీట్లు గెలుచుకున్నప్పటికీ, మంత్రివర్గంలో పరిమితులు ఉండటం వల్ల అర్హులైన పలువురు సీనియర్ నాయకులకు చోటు కల్పించలేకపోయామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంకీర్ణ భాగస్వాముల మధ్య శాఖల కేటాయింపుపై చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని, తుది ఆమోదానికి కేవలం స్వల్ప మార్పులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. అధికారిక అనుమతి అనంతరం, మంత్రుల తుది జాబితాను గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వ గెజెట్ ద్వారా విడుదల చేస్తామని సతీసన్ స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, ఎన్నికల ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంది. సీఎం పదవి కోసం వి.డి. సతీసన్‌తో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రమేష్ చెన్నితాల వంటి బలమైన నేతలు రేసులో నిలిచారు. దీనిపై ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలోని స్థానిక నాయకులు, మాజీ పార్టీ అధినేతలతో పలు దఫాలుగా విస్తృత చర్చలు జరిపింది. క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి కేరళకు చెందిన ఎనిమిది మంది మాజీ రాష్ట్ర యూనిట్ అధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చివరకు ప్రతిపక్ష నేతగా సతీసన్ చూపిన చొరవ, సేవలను గుర్తించి ఆయనకే సీఎం పగ్గాలు అప్పగించారు.

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 102 స్థానాల్లో అఖండ విజయం సాధించి నిర్ణయాత్మక మెజారిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 63 స్థానాలు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, గత 2021 ఎన్నికల్లో 99 స్థానాలతో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఈసారి కేవలం 35 స్థానాలకే పరిమితమై భారీ పరాజయాన్ని చవిచూసింది. సోమవారం వి.డి. సతీసన్ నేతృత్వంలో కేరళలో సరికొత్త పాలన ప్రారంభం కానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us