Kedarnath Temple: కేదర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేత.. ఎందుకంటే

|

May 05, 2023 | 2:52 PM

కేదర్‌నాథ్ యాత్ర కోసం అధికారులు భ‌క్తుల రిజిస్ట్రేష‌న్లను నిలిపివేశారు. వాతావ‌ర‌ణ పరిస్థితులు స‌రిగా లేని కార‌ణంగా.. ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు బంద్ చేసిన‌ట్లు పేర్కొన్నారు . అయితే కేదారీఘాటీలో రానున్న నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. దీంతో వాతావరణం చాలా ప్రమాదక‌రంగా మారే అవ‌కాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.

Kedarnath Temple: కేదర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలిపివేత.. ఎందుకంటే
Kedarnath Temple
Follow us on

కేదర్‌నాథ్ యాత్ర కోసం అధికారులు భ‌క్తుల రిజిస్ట్రేష‌న్లను నిలిపివేశారు. వాతావ‌ర‌ణ పరిస్థితులు స‌రిగా లేని కార‌ణంగా.. ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు బంద్ చేసిన‌ట్లు పేర్కొన్నారు . అయితే కేదారీఘాటీలో రానున్న నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. దీంతో వాతావరణం చాలా ప్రమాదక‌రంగా మారే అవ‌కాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. ఈ క్రమంలో రిజిస్ట్రేష‌న్లు బంద్ చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. టూరిజం శాఖ ప్రకారం ఇప్పటికే దాదాపు 1.26 ల‌క్షల మంది యాత్రకు రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నారు. మే 4వ తేదీ వ‌ర‌కు దాదాపు 1.23 ల‌క్షల మంది భ‌క్తులు కేదార్‌నాథ్‌ను ద‌ర్శించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు గురువారం రోజున కేదార్‌నాథ్ రూట్లో ఉన్న బైరాన్ గ్లేసియ‌ర్ కూల‌డంతో.. ఆ రూటును మూసివేశారు. డీడీఎం, ఎడీఆర్ఎఫ్‌, డీడీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్‌, వైఎంఎఫ్ ద‌ళాలు మంచు ముక్కల్ని తొల‌గించారు. చివరికి గుర్రాలు, గాడిద‌లు వెళ్లే రూటును కూడా ఇంకా తెరువ‌లేదు. ప్రస్తుతం న‌డ‌క రూట్లో ఉన్న మంచును తొల‌గిస్తున్నారు. అలాగే భైర‌వ్‌, కుబేర్ ఘాట్ రూట్లో కూడా గ్లేసియ‌ర్ కూల‌డంతో ఆ రూటును కూడా మూసివేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి