AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: జోషీమఠ్ కుంగుబాటుకు కారణమదేనా? IIRS రిపోర్ట్‌‌లో ఏముంది? ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ టౌన్ ఏటా ఆరున్నర సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోందని మరో కొత్త నివేదిక వెలువడింది. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతున్నాయని

Uttarakhand: జోషీమఠ్ కుంగుబాటుకు కారణమదేనా? IIRS రిపోర్ట్‌‌లో ఏముంది? ప్రభుత్వం ఏం చేస్తోంది?
Joshimath Uttarakhand
Shiva Prajapati
|

Updated on: Jan 12, 2023 | 9:41 AM

Share

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ టౌన్ ఏటా ఆరున్నర సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోందని మరో కొత్త నివేదిక వెలువడింది. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతున్నాయని ఈ రిపోర్ట్ లో తేలింది. రెండేళ్ల పాటు జరిగిన పరిశోధనలో ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు చెబుతున్నారు.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ పరిశోధకులు. టెక్టానిక్ ప్లేట్ల కదలికల్లో మార్పుల వల్లే జోషిమఠ్ ప్రాంతం కుంగిపోతోందని అంటున్నారీ సైంటిస్టులు. దీంతో ఇళ్లు, రోడ్లు సహా ఇతర కట్టడాలకు పగుళ్లు వస్తున్నాయని అంటున్నారు.

జులై 2020 నుంచి మార్చి 2022 వరకు జోషిమఠ్ ఏరియాకు చెందిన ఉపగ్రహ చిత్రాలను నిశితంగా పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు చెబుతున్నారు. జోషిమఠ్ లో పగుళ్లు వచ్చిన పలు ఇళ్లు, హోటళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదకరంగా మారిన పలు కట్టడాలను నిపుణుల బృందం గుర్తించింది. కూల్చివేయాల్సిన నిర్మాణాలకు క్రాస్ మార్క్ చేసింది. వాటి కూల్చివేత పనులు కూడా వెంటనే చేపట్టాల్సి ఉండగా.. స్థానికుల ఆందోళనలతో అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జోషిమఠ్ లో ప్రస్తుతం సుమారు 700 లకు పైగా కుటుంబాల వారు నిరాశ్రయులుగా మారారని అంటున్నారు అధికారులు.

జోషిమఠ్ లో పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, స్థానికంగా స్టోన్ క్రషింగ్ పనులు మాత్రం ఆగడంలేదు. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే చేపట్టిన పనులను సైతం ఆపేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలనూ పట్టించుకోకుండా ఇక్కడింకా పనులు కొనసాగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి