AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపై పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌.. వాసన చూద్దామని ఓపెన్‌ చేస్తే బీభత్సం..

అంటే.. ఈసారి కొత్త తరహాలో పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మే 24న వైష్ణోదేవికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉందని విచారణలో ఆరిఫ్ ఒప్పుకున్నట్లు దిల్‌బాగ్ తెలిపారు.

రోడ్డుపై పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌.. వాసన చూద్దామని ఓపెన్‌ చేస్తే బీభత్సం..
Perfume Bomb
Jyothi Gadda
|

Updated on: Feb 03, 2023 | 7:47 AM

Share

రోడ్డుమీద పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్ చూసిన ఓ వ్యక్తి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. బాటిల్‌ చూసేందుకు కొత్తగా, నిండుగా ఉండటంతో… వాసన ఏమిటో తెలుసుకోవాలని మూత తెరిచి చూశాడు.. అంతే, ఒక్కసారిగా అక్కడి పరిసరాలు భయానకంగా మారిపోయాయి. అతడు ఓపెన్‌ చేసిన పెర్ఫ్యూమ్ బాటిల్ ఒక్కసారిగా పేలిపోయింది. పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ సృష్టించిన విధ్వంసానికి అక్కడి పరిసరాలు వణికిపోయాయి. ఈ దారుణ ఘటన జమ్మూ- కశ్మీర్‌లో చోటు చేసుకుంది. కాశ్మీర్‌లో భద్రతా బలగాలను పక్కదారి పట్టించేందుకు సరిహద్దు అవతలి నుంచి కొత్త మార్గాల ద్వారా ఇలాంటి ‘పెర్ఫ్యూమ్ బాంబ్’లను దిగుమతి చేసుకుంటున్నారు ఉగ్రమూకలు. ఘటనకు సంబంధించి..కశ్మీర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారువేశంలో పనిచేస్తున్న మిలిటెంట్ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి పెర్ఫ్యూమ్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. జనవరి 21న జమ్మూకశ్మీర్‌లోని నర్వాల్‌లో ఉగ్రవాదులు రెండు ఐఈడీలను పేల్చారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేస్తుండగా ఆరీఫ్‌ దొరికాడు. పెర్ఫ్యూమ్ బాటిళ్లలో ప్యాక్ చేసిన ఐఈడీ పేలుడు పదార్థాల వల్లే జంట పేలుళ్లు సంభవించాయని దర్యాప్తులో తేలింది.

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఆరీఫ్‌తో సన్నిహితంగా మెలిగినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు డీజీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆరిఫ్ నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది IEDలతో లోడ్ చేయబడిందిగా గుర్తించారు. బాటిల్ తెరవగానే పేలిపోతుంది. ఇలాంటి పేలుడు పదార్థాలపై పోలీసుల ప్రత్యేక బృందం పరిశోధన ప్రారంభించిందని దిల్‌బాగ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంప్రదాయేతర పద్దతులను తీవ్రవాదులు ప్రయోగిస్తారని పోలీసులు ఆచరణాత్మకంగా భావిస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇంతకుముందెన్నడూ పేలుడు పదార్థాలతో ఇలాంటి పెర్ఫ్యూమ్ బాటిళ్లను పేల్చిన ఘటన ఎప్పుడూ జరగలేదని జమ్మూ-కశ్మీర్ పోలీస్ చీఫ్ చెప్పారు. అంటే.. ఈసారి కొత్త తరహాలో పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మే 24న వైష్ణోదేవికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉందని విచారణలో ఆరిఫ్ ఒప్పుకున్నట్లు దిల్‌బాగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం