AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసిస్ ఉగ్రవాదిపై కొనసాగుతున్న విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు

ఐసిస్‌కి చెందిన అబ్దుల్ యూసుఫ్‌ అనే ఉగ్రవాదిని ఢిల్లీలో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే

ఐసిస్ ఉగ్రవాదిపై కొనసాగుతున్న విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2020 | 2:51 PM

Share

Terrorist Abdul Yusuf: ఐసిస్‌కి చెందిన అబ్దుల్ యూసుఫ్‌ అనే ఉగ్రవాదిని ఢిల్లీలో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడిని 8 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌తో పాటు వివిధ దర్యాప్తు సంస్థలు అతడిని విచారిస్తున్నాయి. ఇక వీరి దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కి చెందిన యూసుఫ్‌, సోషల్ మీడియా ద్వారా ఐసిస్ పట్ల ఆకర్షితుడైనట్లు పోలీసులు గుర్తించారు. రద్దీ ప్రాంతాలు, బీజేపీ నేతలు లక్ష్యంగా యూసుఫ్‌ దాడులకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఒంటరిగానే బాంబు దాడులు, కాల్పులతో విధ్వంసం సృష్టించేందుకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో బలరాంపూర్‌లోని అతడి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. యూసుఫ్ రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లోనూ భద్రతా బలగాల సోదాలు నిర్వహించారు. ఇక యూసుఫ్‌కి పేలుడు పదార్థాలు, మరణాయుధాలు సమకూర్చిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు యూసుఫ్ అరెస్టుతో ఢిల్లీ సహా పరిసర రాష్ట్రాల్లో హై-అలర్ట్ విధించారు. దేశవ్యాప్తంగా మరికొందరు ఐసిస్ పట్ల ఆకర్షితులయ్యారని నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిరియా, పాకిస్తాన్ దేశాల్లోని ఐసిస్ కమాండర్ల ద్వారా వీరికి ఆదేశాలు అందుతున్నట్లు అనుమానిస్తోన్న అధికారులు.. ఆ మేరకు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Read More:

కరోనాను తగ్గిస్తోన్న ఆయింట్‌మెంట్‌.. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

దర్శకుడిని మనువాడిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ భామ