India Economy: జెట్ స్పీడులో భారత ఆర్థికాభివృద్ధి.. ముందుంది మరింత మంచికాలం..
మోదీ 3.0 సర్కార్ పాలన అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతోపాటు.. ఆర్థిక వ్వవస్థకు ఊతమిచ్చేలా దూసుకెళ్తోంది.. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (స్టార్టప్లు) సెక్టర్లను విస్తరించడం, వ్యాపార రంగాలకు ప్రోత్సాహాకాలను అందించడం, పెట్టుబడుదారులను ఆకట్టుకునే నిర్ణయాలను తీసుకోవడం.. ఇవన్నీ ఆర్థిక వృద్ధిని పెంచేలా దోహద పడుతున్నాయి..

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.. ఇప్పుడిప్పుడే పలు దేశాలు కోలుకుంటుంటుండగా.. మరికొన్ని దేశాలు అలానే ముందుకు సాగుతున్నాయి.. అయితే.. భారతదేశం అలా కాదు.. ఆర్థిక వ్యవస్థే కాదు.. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వడంతోపాటు.. మరింత బలంగా మారింది.. దానికి ప్రధాన కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే.. కరోనా తర్వాత.. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది.. ఆర్థిక వ్యవస్థను గట్టేక్కించేందుకు పలు సంస్కరణలు తీసుకువచ్చింది. దీంతో విదేశీ పెట్టుబడులు సైతం భారీగా పెరిగాయి.. మేక్ ఇన్ ఇండియా.. ఆత్మనిర్భర్ భారత్, సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. లాంటి నినాదాలతో పెట్టుబడులను ఆకర్షించింది. అంతేకాకుండా.. పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా సంస్కరణలు, మార్గనిర్దేశం, సహాయ సహకరాలను పెంచడం కూడా వ్యాపార వర్గాలను ఆకట్టుకునేలా చేసింది.. దానికి నిదర్శనం సెమీ కండక్టర్స్ రంగంలో భారీ పెట్టుబడులు.. మొబైల్ తయారీ యూనిట్లు పెరగడం.. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీలు వాటి సంబంధిత పరిశ్రమలు పెరగడం.. అయితే.. మోదీ 2.0 కి మించి… ఇప్పుడు 3.0 సర్కార్ పాలన అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతోపాటు.. ఆర్థిక వ్వవస్థకు ఊతమిచ్చేలా దూసుకెళ్తోంది.. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి అంటే.. 2047లో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని.. వికసిత్ భారత్ నినాదంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక నినాదంతో ముందుకు...