Indian Railways: వేసవి కోసం అదనంగా ప్రత్యేక రైళ్లు.. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ట్రిప్పులే

వేసవి కాలంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. దాదాపు 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. దేశంలోని ఢిల్లీ, పట్నా, విశాఖపట్నం, మంబయి తదితర ప్రధాన నగరాల మీదుగా ఈ రైళ్లను ఏకంగా 6,369 ట్రిప్పులు నడపనున్నారు.

Indian Railways: వేసవి కోసం అదనంగా ప్రత్యేక రైళ్లు.. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ట్రిప్పులే
Train

Updated on: May 21, 2023 | 4:20 AM

వేసవి కాలంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. దాదాపు 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. దేశంలోని ఢిల్లీ, పట్నా, విశాఖపట్నం, మంబయి తదితర ప్రధాన నగరాల మీదుగా ఈ రైళ్లను ఏకంగా 6,369 ట్రిప్పులు నడపనున్నారు. అయితే గతేడాది మాత్రం 348 ప్రత్యేక రైళ్లు నడిపించారు. ఇవి మొత్తం కలిపి 4,599 ట్రిప్పులు నడిపినట్లు రైల్వేశాఖ తెలిపింది.

అయితే ఈసారి గత ఏడాది కంటే ఎక్కవ ట్రిప్పులు నడపనున్నారు. అంటే ఈ 380 ప్రత్యేక రైళ్లు దాదాపు 1,770 ట్రిప్పులు అదనంగా నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు పట్నా – సికింద్రాబాద్‌, పట్నా – యశ్వంత్‌పుర్‌, విశాఖపట్నం – పూరి – హావ్‌డా వంటి తదితర మార్గాల్లో తిరుగుతాయి. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గతేడాది కంటే 80 ట్రిప్పులు అదనంగా 784 ట్రిప్పుల మేరకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..