AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: వేగంగా సాగుతున్న ఆపరేషన్ గంగా.. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న సీ-17 విమానాలు

IAF Evacuation Flights: ఉక్రెయిన్‌లో (Russia Ukraine War) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు వేగంగా సాగుతున్నది. ఆపరేషన్‌ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి..

Russia Ukraine War: వేగంగా సాగుతున్న ఆపరేషన్ గంగా.. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న సీ-17 విమానాలు
C17
Sanjay Kasula
|

Updated on: Mar 03, 2022 | 8:20 AM

Share

యుద్ధభూమి ఉక్రెయిన్‌లో (Russia Ukraine War) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు వేగంగా సాగుతున్నది. ఆపరేషన్‌ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి. రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి 200 మంది భారతీయులతో భారత వైమానిక దళం(ఐఏఎఫ్​) విమానం.. హిండోన్​ ఎయిర్​ బేస్‌లో దిగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో భాగంగా రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి 200 మంది భారతీయులతో భారత వైమానిక దళం(IAF​) విమానం.. హిండోన్​ ఎయిర్​ బేస్‌లో దిగింది. హంగెరీ రాజదాని బుడాపెస్ట్‌ నుంచి 220 మంది భారతీయులతో మరో సీ-17 విమానం ఢిల్లీలోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌కి చేరుకున్నాయి. స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రులు అజయ్‌ భట్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. కాగా, మరో 300 మందితో కూడిన మూడు సీ-17 విమానాలు గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నాయి.

విమానం.. హిండోన్​ ఎయిర్​ బేస్‌లో దిగింది. సీ-17 మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి విమానం.. గురువారం తెల్లవారుజామున 1.30లకు ఢిల్లీలో ల్యాండ్ అయింది.

ఉక్రెయిన్​లోని భారత పౌరులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్​ గంగలో భాగంగా మరో మూడు సీ-17 విమానాల్లో దాదాపు 300 మంది భారత్​కు చేరుకోనున్నారు. ఆ విమానాలు ఉదయం 8 గంటలకు హిండోన్ ఎయిర్‌బేస్‌లో దిగనున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌లో దాదాపు 8,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు చిక్కుకుపోయారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారిని తరలించేందుకు నలుగులు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్​ పొరుగు దేశాలకు వెళ్లారు. హంగేరీలో హర్దీప్​సింగ్​ పూరి, రొమేనియాలో జ్యోతిరాదిత్య సింధియా, స్లోవేకియాలో కిరణ్​ రిజిజు, పోలాండ్‌లో వీకే సింగ్ ఉన్నారు.

రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల నుంచి భారత్​ ప్రత్యేక విమానాల ద్వారా తన పౌరులను తరలిస్తోంది. ఈ పొరుగు దేశాల నుంచే సీ-17 విమానాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Russia-Ukraine War: ఫైటింగ్ స్టైయిల్ మార్చిన ఉక్రెయిన్ యువత.. రష్యన్‌ దళాలపై పెట్రోల్‌ బాంబులతో దాడి.. 

థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో