Remdesivir Medicine: రెమిడెసివిర్‌ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

|

Apr 30, 2021 | 8:26 PM

Remdesivir Medicine: ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో..

Remdesivir Medicine: రెమిడెసివిర్‌ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Remdesivir
Follow us on

Remdesivir Medicine: ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. కరోనా చికిత్సలో ఈ రెమిడెసివిర్‌ కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీని కొరత పెరిగిపోతోంది. అయితే ఈ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డ్రగ్‌ను విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

4.5 లక్షల డోస్‌ల రెమిడెసివిర్‌ను పలు కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్ వయల్స్‌ ఈ రోజు భారత్‌కు రానున్నాయి. దేశీయ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, ఈజిప్టుకు చెందిన ఇవా ఫార్మా సంస్థల నుంచి ఈ డ్రగ్‌ను కొనుగోలు చేయనుంది. అలాగే దేశీయంగా కూడా దీని ఉత్పత్తిని పెంచే విధంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏడు దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03 కోట్ల వయల్స్‌కు పెంచాయి. ఈ డ్రగ్‌కు భారీ డిమాండు ఉన్నందున కొరతను నివారించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఇవీ కూడా చదవండి:

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

Trees: రెండు చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా .. ఈ చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు