
India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు భారీగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య రెండు లక్షలకు దిగువగానే నమోదైంది. కానీ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా నిన్న 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1008 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే.. 6.8 శాతం కేసులు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 2,59,107 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,33,921 కేసులు యాక్టివ్గా (Active cases) ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,98,983 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 167.87 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.
India reports 1,72,433 fresh COVID cases (6.8% higher than yesterday), 2,59,107 recoveries, and 1008 deaths in the last 24 hours
Active cases: 15,33,921
Death toll: 4,98,983
Daily positivity rate: 10.99%Total vaccination: 167.87 crore pic.twitter.com/ZgQtIloAzu
— ANI (@ANI) February 3, 2022
Also Read: