Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Coronavirus Updates: దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు వెయికి అటు ఇటుగా నమోదవుతోంది. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Coronavirus

Edited By:

Updated on: Apr 18, 2022 | 11:48 AM

India Coronavirus Updates: దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు వెయికి అటు ఇటుగా నమోదవుతోంది. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 1,150 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. శుక్రవారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య దాదాపు 225 పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటి రేటు 0.31 శాతం ఉంది. దేశంలో ప్రస్తుతం 11,558 (0.03) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి 954 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,08,788 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,42,097 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,751 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 186,51,53,593 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 12,56,533 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

దేశ వ్యాప్తంగా నిన్న 3,65,118 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 83.18 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

Also Read:

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!

Prabhas: ఆ కారు ప్రభాస్‌ది కాదట.. క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్.. అసలేమైందంటే..?

Follow Us