2.కి.మీ నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి.. దారిపొడవునా ప్రజలకు అభివాదం

|

Nov 11, 2022 | 9:31 AM

భువనేశ్వర్ చేరుకున్న రాష్ట్రపతి, ఆమె కాన్వాయ్‌ను మధ్యలో ఆపి, కారు దిగి, సాధారణ భక్తుల మాదిరిగానే కాలినడకన ఆలయం వైపు నడవడం ప్రారంభించారు. జగన్నాథుడిని స్తుతిస్తూ ఆమె చేతులు పైకెత్తి నడకసాగించారు.

2.కి.మీ నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి..  దారిపొడవునా ప్రజలకు అభివాదం
Droupadi Murmu
Follow us on

ఆలయంలోని 16 వైపుల, 34 అడుగుల ఎత్తైన అరుణ స్తంభం, మందిరంలోని దేవతల ముందు మోకరిల్లి దేశ క్షేమం కోసం ప్రార్థించారు.
పూరీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగన్నాథ ఆలయంలో దర్శనం కోసం సాధారణ ప్రజల మాదిరిగా 2 కిలోమీటర్లు నడిచారు. 12వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన రాష్ట్రపతి ఆలయానికి కాలినడకన చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఒడిశాలోని మయూర్‌భాజ్ జిల్లాకు చెందిన గిరిజన వర్గానికి చెందిన ముర్ము మోకాళ్లపై నిలబడి ప్రార్థన చేస్తూ, ఆలయంలోని సింహాద్వారం ముందున్న 34 అడుగుల ఎత్తైన అరుణ్ స్తంభానికి మొక్కుకున్నారు. సుభద్రాదేవి, బలభద్రుడి విగ్రహాల ముందు మోకరిల్లి ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి తన పర్యటన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్‌ చేశారు.

అంతకుముందు భువనేశ్వర్ చేరుకున్న రాష్ట్రపతి, ఆమె కాన్వాయ్‌ను మధ్యలో ఆపి, కారు దిగి, సాధారణ భక్తుల మాదిరిగానే కాలినడకన  ఆలయం వైపు నడవడం ప్రారంభించారు. జగన్నాథుడిని స్తుతిస్తూ ఆమె చేతులు పైకెత్తి నడకసాగించారు. దారిలో నిలబడిన ప్రజల అభినందనలు కూడా స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

ఆమె భువనేశ్వర్‌లోని బాలగండి చౌక్‌కు చెందిన సాధారణ మహిళలా గుడికి వెళ్లడం ప్రారంభించింది. ఆలయ దర్శనానికి రాష్ట్రపతి వస్తున్నారనే వార్త తెలియగానే రోడ్డుకు ఇరువైపులా వందలాది మంది గుమిగూడారు. అందరికీ అభివాదం చేస్తూ రాష్ట్రపతి ప్రయాణం సాగింది.

ఆలయంలోని 16 వైపుల, 34 అడుగుల ఎత్తైన అరుణ స్తంభం, మందిరంలోని దేవతల ముందు మోకరిల్లి దేశ క్షేమం కోసం ప్రార్థించారు. శ్రీ జగన్నాథ ఆలయంలో జరిగిన మహాప్రసాదంలో రాష్ట్రపతి కూడా పాల్గొన్నారు.

రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా, ఆలయాన్ని ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సాధారణ దర్శనాలు నిలిపివేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి