AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు..!

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పలు సాంకేతిక కారణాలతో కొన్ని ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోల్పోయింది. దీంతో ఆ భర్తీ స్థానాన్ని పూడ్చేందుకు సిద్ధమైంది. రక్షణావసరాల కోసం 33 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిలో పన్నెండు సుఖోయ్-30 విమానాలు, 21 మిగ్-29 విమానాలను కొనేందుకు ప్రణాళిక రూపొందించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో కొద్ది వారాల్లో జరగనున్న […]

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 29, 2019 | 8:17 PM

Share

భారత అమ్ములపొదిలోకి మరో 33 ఫైటర్ జెట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పలు సాంకేతిక కారణాలతో కొన్ని ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోల్పోయింది. దీంతో ఆ భర్తీ స్థానాన్ని పూడ్చేందుకు సిద్ధమైంది. రక్షణావసరాల కోసం 33 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిలో పన్నెండు సుఖోయ్-30 విమానాలు, 21 మిగ్-29 విమానాలను కొనేందుకు ప్రణాళిక రూపొందించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో కొద్ది వారాల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశం చర్చకు రానుంది. ఇప్పటి వరకు భారత్ కోల్పోయిన సుఖోయ్-30 విమానాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టనున్నారు. భారత్ వద్ద ప్రస్తుతం మిగ్-29కు సంబంధించి మూడు స్క్వాడ్రన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విషయమై ఇప్పటికే రష్యాతో చర్చలు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా ఈ చర్చలు పూర్తి చేసి, ఒప్పందం కుదుర్చుకునే దిశగా వాయుసేన అడుగులు వేస్తోంది.