AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Charges: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. నేటి నుంచి టోల్ ఛార్జీల పెంపు

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు నేటి ఆదివారం అర్ధరాత్రి నుంచి (సాంకేతికంగా జూన్ 3 నుంచి) అమలు కానున్నాయి. సాధారణంగా అయితే.. ఏటా ఏప్రిల్‌ 1వ తేదీన టోల్‌ ఫీజులను పెంచుతుంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Toll Charges: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. నేటి నుంచి టోల్ ఛార్జీల పెంపు
Toll Gate
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2024 | 4:36 PM

Share

దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచింది NHAI. ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ధరలు 5 శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల వల్ల ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని NHAI నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ NHAIను ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఇప్పుడు చివరి విడత పోలింగ్‌ కూడా ముగియడంతో టోల్‌ ఛార్జీల పెంపునకు అనుమతి ఇస్తూ NHAI ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక రాష్ట్రంలో ఎక్కువగా రాకపోకలు సాగే హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు దగ్గర టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి టోల్‌ ఛార్జీ రూ.5 పెరగగా.. ఇరువైపులా కలిపి రూ.10, బస్సులు, ట్రక్కులు ఒక వైపు ప్రయాణానికి 25 రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి 35 రూపాయలు, భారీ సరకు రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ. 35, రెండు వైపులా కలిసి రూ.50 వరకు టోల్‌ ఛార్జీలు పెంచారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు 25 శాతం రాయితీ లభిస్తుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్‌ రూ.330 నుంచి 340కి పెరిగింది. అయితే ఈ పెంచిన ఛార్జీలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలను NHAI పెంచుతూ వస్తుంది.

అయితే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారు, వ్యాన్, జీపు, లైట్ మోటర్ వాహనంలో వెళ్లాలంటే.. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో మొత్తంగా ఒకవైపు అయితే 335 రూపాయలు, రెండువైపులా అయితే 500 రూపాయలు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా