హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం వెలువడుతుంది. ఉదయం 11 గంటలకు ట్రెండ్స్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హర్యానాలో 90, జమ్ముకశ్మీర్లో 90 నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
హర్యానాలో 90 నియోజకవర్గాలకుగానూ 1,031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు. 101 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక కశ్మీర్లో 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 63.45 శాతం పోలింగ్ జరిగింది.
ఇది చదవండి: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..