AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్‌ వెజ్‌ను పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం.. మనదేశంలోనే ఉందని తెలుసా?

గుజరాత్‌లోని పాలిటానా నగరం మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోనే తొలి నగరంగా నిలిచింది. జైన మత ప్రభావం, పర్యాటకంపై దీని ప్రభావం గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. 200 మంది జైన సన్యాసుల నిరసనల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇది జైనాలకు పవిత్రమైన యాత్రా స్థలం కావడం దీనికి కారణం. ఇతర గుజరాత్ నగరాల్లో కూడా ఇలాంటి నిబంధనలు అమలులో ఉన్నాయి.

నాన్‌ వెజ్‌ను పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం.. మనదేశంలోనే ఉందని తెలుసా?
Palitana
SN Pasha
|

Updated on: Mar 14, 2025 | 8:26 PM

Share

మన దేశంలో ఎక్కువ మంది నాన్‌వెజ్‌ తింటారు. చాలా తక్కువ మంది మాత్రమే నాన్‌ వెజ్‌కు దూరంగా ఉంటూ.. శాఖాహారం మాత్రం తింటారు. కేవలం వెజ్‌ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్మేవాళ్లు, అలాగే కొన్ని మతపరమైన అంశాలతో కూడా కొంతమంది వెజ్‌ మాత్రమే తింటూ ఉంటారు. అయితే.. నాన్‌ వెజ్‌ను ఓ నగరం పూర్తిగా నిషేధించింది. ఈ నగరంలో నాన్‌ వెజ్‌ క్రయవిక్రయాలు కూడా జరగవు. ఇలా నాన్‌ వెజ్‌ను పూర్తిగా నిషేధించిన తొలి నగరంగా చరిత్ర సృష్టించింది. ఈ నగర మరెక్కడో కాదు.. మనదేశంలోనే ఉంది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా నగరం, మాంసాహారం అమ్మకం, వినియోగాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించిందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ప్రాంతంలో గణనీయమైన సాంస్కృతిక, మతపరమైన మార్పును సూచిస్తుంది, ఇది జైనమతం, దాని సూత్రాల బలమైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. పాలిటానాలో మాంసం కోసం జంతువులను వధించడం కూడా నిషేధించారు. నగరంలో సుమారు 250 కబేళాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరంతర నిరసనలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలిటానా కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది జైనులకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాలలో ఒకటి. దీనికి “జైన్ టెంపుల్ టౌన్” అనే మారుపేరు వచ్చింది. శత్రుంజయ కొండల చుట్టూ ఉన్న ఈ నగరం 800 కి పైగా దేవాలయాలకు నిలయంగా ఉంది, వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఆదినాథ్ ఆలయం.

ఈ దేవాలయానికి ఏటా వేలాది మంది భక్తులను, పర్యాటకులు వస్తుంటారు. పాలిటానా తర్వాత రాజ్‌కోట్, వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్‌తో సహా గుజరాత్‌లోని ఇతర నగరాలు ఇలాంటి నిబంధనలను అమలు చేశాయి. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ నిబంధనలకు మద్దతు ఇచ్చారు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాంసం దుకాణాల సమూహంగా ఏర్పడటం వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కూడా ఈ నిబంధనల లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. పాలిటానా, గుజరాత్లోని ఇతర నగరాల్లో మాంసాహార ఆహారాన్ని నిషేధించాలనే నిర్ణయం ఒక చారిత్రాత్మక మైలురాయిగా చెప్పుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..