leopard Attack: ఆ గ్రామంలో చిరుత సంచారం.. నలుగురిపై దాడి! చివరకు ఏం జరిగిందంటే..

కపద్వంజ్ గ్రామంలోని వంసదా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుతపులి పశువులపై దాడి చేసింది. పశువులను కాపాడే ప్రయత్నంలో నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. అనంతరం సమీపంలోని ఓ ఇంటి లోపల చిరుత దాక్కుంది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది..

leopard Attack: ఆ గ్రామంలో చిరుత సంచారం.. నలుగురిపై దాడి! చివరకు ఏం జరిగిందంటే..
Leopard Attack On Villagers

Updated on: Jul 12, 2025 | 8:21 AM

గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలోని వాన్స్‌డా తాలూకాలోని కపద్వాంజ్ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్థులపై చిరుత దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. కపద్వంజ్ గ్రామంలోని వంసదా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుతపులి పశువులపై దాడి చేసింది. పశువులను కాపాడే ప్రయత్నంలో నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. అనంతరం సమీపంలోని ఓ ఇంటి లోపల చిరుత దాక్కుంది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం సమీపంలోని అడవి నుంచి చిరుతపులి వచ్చినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు రెండు గంటల్లో పట్టుకున్నారు. చిరుత ఇంట్లోకి దాక్కుండడంతో అటవీ శాఖ జాగ్రత్తగా ఇంటిని మూసివేసి చిరుతను పట్టుకుంది. రెండున్నర గంటల్లోనే వంసదా అటవీ శాఖ బృందం చిరుతను అదుపులోకి తీసుకుంది. చిరుత వయస్సు సుమారు 5 నుంచి 7 సంవత్సరాలు ఉంటుందని ఆర్‌ఎఫ్‌ఓ జెడీ పటేల్ అన్నారు. ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణ ప్రక్రియలకు అనుగుణంగా దాన్ని తరలించినట్లు వెల్లడించారు. వన్యప్రాణి దాడులపై అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గ్రామాల్లో చిరుతల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరమైతే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని కోరారు. బాధితులను కలు భాయ్ మందా భోయా (40), ప్రతాప్ శంకర్ ధూమ్ (35), ప్రతీక్ సుభాష్ మహాలా (25), గిరీష్ మహాకల్ (35)గా గుర్తించారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చిరుతపులి పశువులను వెతుక్కుంటూ గ్రామంలోకి ప్రవేశించి ఉండవచ్చు. మా బృందం డార్ట్ గన్ ఉపయోగించి జంతువును సురక్షితంగా ప్రశాంతపరచి, ఇంట్లోకి ప్రవేశించిన 20 నిమిషాల్లోనే దానిని బంధించినట్లు అటవీ అధికారి జెడి రాథోడ్ అన్నారు. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ఐదు గంటలు కొనసాగిందన్నారు. రెస్క్యూ బృందం గ్రామస్తులు, చిరుతపులి ఇరువురి భద్రత దృష్ట్యా జాగ్రత్తగా ఆపరేషన్‌ నిర్వహించింది. బంధించిన చిరుతను సురక్షితంగా గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలిపారు. కాగా వాన్స్‌డా ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలి నెలల్లో తాలూకాలో కనీసం మూడు వేర్వేరు చిరుతపులి దాడులు నమోదయ్యాయి. చిరుత వరుస దాడుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us