AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groom: పాపం పెళ్లికొడుకు..! రాత్రంతా కాలినడకన వెళ్లి వధువు మెడలో తాళి కట్టాడు..! ఎందుకంటే..

వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కల్యాణ్‌ సింగ్‌పూర్‌ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి కాలినడకన బయల్దేరారు. గురువారం సాయంత్రం బయల్దేరి శుక్రవారం ఉదయానికి వధువు ఇంటికి చేరుకున్నారు.

Groom: పాపం పెళ్లికొడుకు..! రాత్రంతా కాలినడకన వెళ్లి వధువు మెడలో తాళి కట్టాడు..! ఎందుకంటే..
Groom Walks All Night
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2023 | 5:11 PM

Share

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, తాజాగా పెళ్లికి సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాపం ఒక వరుడు.. తన పెళ్లి కోసం నానాపాట్లు పడ్డాడు. ముహూర్త సమయానికి వధువు మెడలో తాళి కట్టేందుకు గానూ వరుడితో పాటు అతని బంధువులు సైతం రాత్రంతా కాలినడకన ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కల్యాణ్‌ సింగ్‌పూర్‌ బ్లాక్‌ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలో డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బుధవారం నుంచి ఒడిశాలో డ్రైవర్లు ఉద్యమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లికోసం ముందుగానే వాహనాలు బుక్‌ చేసుకున్నప్పటికీ యజమానులు రద్దు చేసుకున్నారు. దీంతో వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కల్యాణ్‌ సింగ్‌పూర్‌ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి కాలినడకన బయల్దేరారు. గురువారం సాయంత్రం బయల్దేరి శుక్రవారం ఉదయానికి వధువు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి తంతు ముగిసింది కానీ, తిరిగి వరుడు, అతని బంధువులు పెళ్లికూతురు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. డ్రైవర్ల సంఘం సమ్మె విరమిస్తేనే వారు స్వగ్రామానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పెళ్లికూతురు ఇంట్లోనే బస చేయాలని నిర్ణయించారు. డ్రైవర్ల సమ్మె ముగిసిన తర్వాతే తిరిగి తమ గ్రామానికి వెళ్తామంటున్నారు.

ఒడిశాలో ఏక్తా మహాసంఘ్ అనే డ్రైవర్ల సంస్థ సమ్మెకు శ్రీకారం చుట్టింది. డ్రైవర్లకు సామాజిక సంక్షేమ పథకాలు అవసరమని, అందుకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లకు పెన్షన్, బీమా మొదలైనవి కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు వాహనాల బంద్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం