
ముంబైలో ఇవాళ ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ముంబై- పూణే మార్గంలో తెల్లవారుజామున జంబుర్గ్- థాకూర్ వాడీ రైల్వేస్టేషన్ల మధ్య ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. రెండు బోగీలు నేలకొరిగాయి. దీంతో ముంబై నుంచి పూణేకు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ముంబై-పూణే నగరాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఇగత్పురి రైల్వేస్టేషను మీదుగా దారి మళ్లించారు.