ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మార్చి 31 1938లో జన్మించిన ఆమె.. ఢిల్లీకి అత్యధికకాలంగా సీఎంగా పనిచేశారు. 1998 నుంచి 2013 వరకూ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. ఈమె హయాంలోనే ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ గేమ్స్ నడిచాయి. 2014 మార్చి 11న యూపీఏ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్గా నియమించింది. అయితే ప్రభుత్వం మారి ఎన్డీఏ రావడంతో.. ఆమె అనూహ్యంగా ఆగస్ట్ 25న రాజీనామా చేశారు.