ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా పదవిని చేపట్టిన నరేంద్ర మోడీ సర్కార్ తొలి కేబినేట్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పలు నిర్ణయాలను తీసుకుంది. బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాని ఆవాస్ యోజన పథకం అమలుపై పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని మోడీ ప్రభుత్వం 3.0 తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇలా నిర్మించే కొత్త ఇళ్లకు ఎల్పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్లు వంటి సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో బీజేపీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి హామీ నెరవేర్చే దిశగా ప్రధాని మోడీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుని మేనిఫెస్టోలోని తొలి హామీని నెరవేర్చింది. అయితే గత 10 సంవత్సరాలలో ప్రధాని ఆవాస్ యోజన పథకంలో సుమారు 4.21 కోట్ల ఇళ్లు నిర్మించబడ్డాయి.
పీఎం హౌస్లో జరిగిన ఈ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. పీఎం హౌస్లో జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, సర్బానంద సోనోవాల్, రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్, లాలన్ సింగ్ సహా పెద్ద నేతలు పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున.. మోడీ PMOకి చేరుకుని.. కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 17వ విడతలో నిధులను విడుదల చేశారు.
First Cabinet Meeting Of Modi 3.0
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..