భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్).. 4,062 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్టీఎస్) కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఈఎస్ఎస్ఈ)-2023 ఆధారంగా ఈ నియామక ప్రక్రియ చేపడుతారు. మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి. ప్రిన్సిపల్, పీజీటీ, అకౌంటెంట్, జేఎస్ఏ, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31, 2023వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ప్రిన్సినల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1500, నాన్ టీచింగ్ పోస్టులకు రూ.1000ల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.