చేతికి మట్టి అంటకూడదు.. రూపం మార్చిన ఉగ్రవాదం.. అదేనా ఢిల్లీ బ్లాస్ట్ స్ట్రాటజీ!
దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ప్రపంచానికి బాగా వినపడుతుంది. ఇదేనా టెర్రరిస్టుల వ్యూహం. ఈసారి ఢిల్లీనే టార్గెట్ కాబోతోందని ఎక్కడో అనుమానం అయితే ఉంది. పట్టుబడుతున్న డాక్టర్లు, దొరికిన ఆధారాలు సైతం ఢిల్లీనే లక్ష్యం అని చూపించాయి. కశ్మీర్ లోయలో దొరికిన డాక్టర్ని ప్రశ్నించినా సరే.. వారి కళ్లు, వేళ్లు ఢిల్లీ మ్యాప్నే చూపించాయి. అప్పటికే ఆలస్యం చేయకుండా ఒక్కో లింక్ పట్టుకుని చకచకా వేటాడుతూనే వచ్చింది ఇంటెలిజెన్స్.

ఒక భారీ పేలుడు జరగాలి. ఆ పేలుడు ఎలా ఉండాలంటే.. ‘నెవర్ బిఫోర్’ అన్నట్టుగా కనిపించాలి. బట్.. వేళ్లు మాత్రం పాకిస్తాన్వైపు చూపించకూడదు. ఢిల్లీ బ్లాస్ట్ వెనక ఉగ్రవాదుల వ్యూహం ఇదేనా? ఎందుకీ డౌట్ అంటే. ఇంకొక్క ఉగ్రదాడి జరిగినా, చేసింది పాకిస్తానే అని తెలిసినా.. బ్రహ్మోస్ మిస్సైల్స్ లేస్తాయ్. దీనిపై గతంలోనే హెచ్చరించింది భారత్. అటు చూస్తే.. ఇండియన్ ఆర్మీ నుంచి ఇంకొక్క దాడిని కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. సో, భారత్లో ఉగ్రదాడి చేయాలి… కాని పాకిస్తాన్పై అటాక్ జరక్కూడదు. అంటే ఏంచేయాలి? ఉగ్రదాడే కానీ ఏ ఉగ్రవాద సంస్థ చేసిందో అధికారికంగా తెలియకూడదు. అందుకేనా డాక్టర్లతో ఉగ్రకుట్రకు ప్లాన్ చేయించింది? మనందరికీ తెలుసు.. భారత్లో ఉగ్రదాడి జరిగిందంటే ఆ టెర్రిరిస్ట్ గ్రూప్ పుట్టుక పాకిస్తానే అయి ఉంటుందని. సో, ఫలానా ఉగ్ర సంస్థ అని తెలిసినా చాలు. పాకిస్తాన్కు ఈసారి దబిడిదిబిడే. అందుకే, ఇప్పటి వరకు ఏ టెర్రర్ గ్రూప్ కూడా తామే చేశామని చెప్పుకోలేదు. మరి ఎవరు చేశారు? ఇదొక కొత్తరకం మోడస్ ఆఫ్ ఆపరాండీ. పాకిస్తాన్కు ఏమీ కాకుండా, పాక్ వైపు వేలెత్తి చూపకుండా భారత్పై దాడి చేయడమే సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది. అందులోనూ ఢిల్లీ బ్లాస్ట్కు వాడిన ఎక్స్ప్లోజివ్ గతంలో ఎక్కడా వాడినట్టు కనిపించలేదు? ఇంతకీ ఏంటా పేలుడు పదార్థం? ఢిల్లీ కారు బాంబ్ వెనక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో...




