India Coronavirus: ఫోర్త్ వేవ్ అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..?

|

Apr 28, 2022 | 11:15 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్రం సూచనలతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా అమలవుతున్నాయి.

India Coronavirus: ఫోర్త్ వేవ్ అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..?
India Coronavirus Updates
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో అంతటా అందోళన నెలకొంది. కేంద్రం సూచనలతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. కాగా.. గత 24 గంటల్లో కరోనా (Covid-19) కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 3,303 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 376 కేసులు పెరిగాయి. నిన్న కరోనా మహమ్మారితో 39 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 16,980 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.66 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

దేశంలో కరోనా కేసుల వివరాలు..

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,68,799 కి చేరింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,23,693 కి పెరిగింది.
  • నిన్న కరోనా నుంచి 2,563 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,28,126 కి చేరింది.
  • ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతం ఉంది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 188,40,75,453 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 19,53,437 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: ఫోన్‌కు దండేసి దండం పెట్టాడు.. చివరకు ఏం చేశాడంటే..? వైరల్ వీడియో

Pulwama Encounter: జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..