India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో అంతటా అందోళన నెలకొంది. కేంద్రం సూచనలతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. కాగా.. గత 24 గంటల్లో కరోనా (Covid-19) కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 3,303 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 376 కేసులు పెరిగాయి. నిన్న కరోనా మహమ్మారితో 39 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 16,980 (0.04 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.66 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో కరోనా కేసుల వివరాలు..
COVID-19 | India reports 3,303 fresh cases and 2,563 recoveries, in the last 24 hours. Active cases 16,980
Daily positivity rate (0.66%) pic.twitter.com/29SNk65cOq
— ANI (@ANI) April 28, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: