గబ్బిలాల్లో కరోనా వైరస్.. కానీ..

ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లో రెండు జాతులకు చెందిన గబ్బిలాల్లో వేర్వేరు రకాల కరోనా వైరస్ లు ఉన్నట్టు కనుగొన్నారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్ఛేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని ఈ జాతుల గబ్బిలాలను రీసెర్చర్లు పరిశోధించినప్పుడు మొదటిసారిగా ఈ విషయం వెల్లడైంది.

గబ్బిలాల్లో కరోనా వైరస్.. కానీ..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 15, 2020 | 1:45 PM

ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లో రెండు జాతులకు చెందిన గబ్బిలాల్లో వేర్వేరు రకాల కరోనా వైరస్ లు ఉన్నట్టు కనుగొన్నారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్ఛేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని ఈ జాతుల గబ్బిలాలను రీసెర్చర్లు పరిశోధించినప్పుడు మొదటిసారిగా ఈ విషయం వెల్లడైంది. ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తన అధ్యయనంలో  దీని గురించి వివరిస్తూ.. ఏది ఏమైనా ఈ వైరస్ ల వల్ల మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ బ్యాట్ కరోనా వైరస్ ని ‘బీ టీ కోవ్’ అని వ్యవహరిస్తున్నారు. ఈ దేశంలోని గబ్బిలాల్లో కరోనా వైరస్ సర్క్యులేషన్ గురించి తెలుసుకోవడంలో ఈ స్టడీ ఓ ముందడుగని భావిస్తున్నారు. మానవులకు ఈ వైరస్ ల కారణంగా వ్యాధులు సంక్రమిస్తాయనడానికి ఆధారాలు  లేనప్పటికీ..ఇతర  వివరాలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని అంటున్నారు. వ్యాప్తి చెందే వైరస్, రిస్క్ మిటిగేషన్ ( ముప్పు నివారణ) అన్న అంశాలను తాము స్టడీ చేస్తున్నట్టు ఈ అధ్యయన తొలి వ్యాసకర్త ప్రగ్యా డీ. యాదవ్ తెలిపారు.

చైనాలోని వూహాన్ లో గల గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందాయని భావిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి ఎన్నో అధ్యయనాలు, థియరీలు బయటకి వచ్చాయని, అయితే మన దేశంలోని ఈ నాలుగు రాష్ట్రాల్లో గల గబ్బిలాల్లో కనుగొన్న వైరస్ కి. వూహాన్ గబ్బిలాల వైరస్ కి ఎంతో తేడా ఉందని యాదవ్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో రూసెటస్, టెరోపస్ అనే రెండు జాతుల గబ్బిలాల్లో  ఈ వైరస్ ని కనుగొన్నప్పటికీ కోవిడ్-19 కి కారణమైన ‘సార్స్-కోవ్ -2’ కి ఇది సంబందించినది కాదని స్పష్టం చేశారు. వీటిలో టెరోపస్ జాతి గబ్బిలాల్లో కేరళలో 2018.,2019 సంవత్సరాల్లో బయటపడిన నిఫా వైరస్ ని కనుగొన్నట్టు ఆయన వివరించారు. అయితే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.