AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా మా భూభాగాలను ఆక్రమిస్తోంది… నేపాల్ గగ్గోలు

భారతభూభాగాలపై కన్నేసి, కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా ఇప్పుడు నేపాల్ ప్రాంతాలమీదా 'దృష్టి' సారించింది. నేపాల్ భూభాగంలోని 11 ప్రాంతాలకు గాను 10 ప్రాంతాలను చైనా ఆక్రమించుకుందని ఆ దేశం ఆరోపించింది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన..

చైనా మా భూభాగాలను ఆక్రమిస్తోంది... నేపాల్ గగ్గోలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 24, 2020 | 11:32 AM

Share

భారతభూభాగాలపై కన్నేసి, కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా ఇప్పుడు నేపాల్ ప్రాంతాలమీదా ‘దృష్టి’ సారించింది. నేపాల్ భూభాగంలోని 11 ప్రాంతాలకు గాను 10 ప్రాంతాలను చైనా ఆక్రమించుకుందని ఆ దేశం ఆరోపించింది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వే డిపార్ట్ మెంట్ రూపొందించిన ఓ నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఏయే ప్రాంతాల్లో చైనా తిష్ట వేసిందో వివరించింది. ఈ పది ప్రాంతాల్లో.. రానున్న రోజుల్లో చైనా బోర్డర్ పోస్టులను ఏర్పాటు చేయవచ్చునని నేపాల్ భయపడుతోంది. టిబెట్ అటానమస్ రీజియన్ పేరిట తన రోడ్ నెట్ వర్క్ ని డ్రాగన్ కంట్రీ విస్తరిస్తోంది.. కొన్ని నదులు, వాటి ఉపనదుల నీరు మా దేశ భూభాగాల దిశగా పారుతుండడంతో..అవి (భూభాగాలు) క్రమేపీ నశిస్తున్నాయి..దీంతో క్రమంగా చైనాకు చెందిన ‘టార్’ వైపు అవి మారిపోవచ్చు.. ఫలితంగా ఆ ప్రాంతాలను కూడా చైనా తమవిగా చెప్పుకోవచ్చు.. అని ఈ నివేదిక పేర్కొంది. బాగ్డేర్ ఖోలా, కర్నాలీ నదుల నీటిని మళ్లించి హుమ్లా జిల్లాలో పది హెక్టార్ల భూమిని చైనీయులు ఆక్రమించుకున్నారని, రసూలా జిల్లాలో ఆరు ఎకరాల నేపాలీ భూమిని కూడా ఆక్రమించి రోడ్డు నిర్మిస్తోందని నేపాల్ ఆరోపించింది. టిబెట్ లో ఆ దేశం చేపడుతున్న రోడ్డు నిర్మాణాల వల్ల మరి కొన్ని నదుల నీరు మళ్లిపోతోందని, తక్షణమే ప్రభుత్వం  సరైన చర్యలు తీసుకోకపోతే.. మరిన్ని భూభాగాలను చైనా ఆక్రమించుకోవడం తథ్యమని నేపాలీయులు గగ్గోలు పెడుతున్నారు.