
సరిహద్దులో చైనాతో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య, రక్షణ గూఢచార సంస్థలు చైనా మొబైల్ ఫోన్లకు సంబంధించి సలహా ఇచ్చాయి. సరిహద్దుల్లో ఉన్న సైనికులు, వారి కుటుంబాలు చైనా మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా చూసుకోవాలని నిఘా సంస్థలు కోరాయి. వివిధ మార్గాల ద్వారా.. (చైనీస్) మొబైల్ ఫోన్ పరికరాలతో జాగ్రత్త వహించాలని సూచించింది. ఈ విషయాన్ని అన్ని సైనిక వర్గాలను కోరాలని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జారీ సలహా పేర్కొంది. వార్తా సంస్థ ANI అందించిన సమాచారం ప్రకారం, శత్రు దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫోన్లను కొనడం లేదా ఉపయోగించడం మానుకోవాలని.. సైనికులు, వారి కుటుంబాలకు సూచించాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. చైనీస్ మూలానికి చెందిన మొబైల్ ఫోన్లలో మాల్వేర్, స్పైవేర్లను ఏజెన్సీలు గుర్తించిన సందర్భాలు ఉన్నందున ఈ సలహా జారీ చేయబడిందని తెలిపింది.
దేశ వాణిజ్య మార్కెట్లో అందుబాటులో ఉన్న చైనీస్ మొబైల్ ఫోన్లలో Vivo, Oppo, Xiaomi, One Plus, Honor, Realme, ZTE, Gionee, Asus, Infinix ఉన్నాయి. గతంలో కూడా, చైనీస్ మొబైల్ ఫోన్ అప్లికేషన్లకు వ్యతిరేకంగా గూఢచారి ఏజెన్సీలు చాలా చురుకుగా వ్యవహరించాయి. సైనిక సిబ్బంది ఫోన్ల నుంచి ఇలాంటి అనేక అప్లికేషన్లు తొలగించబడ్డాయి.
రక్షణ దళాలు తమ పరికరాలపై చైనీస్ మొబైల్ ఫోన్లు, చైనీస్ అప్లికేషన్లను ఉపయోగించడం కూడా నిలిపివేశాయి. మార్చి 2020 నుంచి భారత్- చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన మరింత పెరిగింది. తూర్పు లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు LAC పై ఇరు దేశాలు పరస్పరం భారీ మోహరింపు చేశాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికులు ముఖాముఖి తలపడ్డారు. అనంతరం అధికారులు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి పరిస్థితిని అదుపు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం