Chhattisgarh: బాలుడిని కాటేసిన పాము.. కోపంతో షాకింగ్ పని చేసిన బాధితుడు.. పాము అక్కడికక్కడే మృతి
గార్డెన్ బ్లాక్లోని పండారపత్లో నివసిస్తున్న పహారీ కోర్వా కుటుంబానికి చెందిన 12 ఏళ్ల దీపక్ సమీపంలో నివసిస్తున్న తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. దీంతో దీపక్ కోపం వచ్చి.. వెంటనే ఆ పామును పట్టుకుని పళ్లతో కొరికాడు. పాము వెంటనే మరణించింది
ఛత్తీస్ గడ్ జష్పుర్ జిల్లాలో దీపక్ రామ్ అనే 12 ఏళ్ల బాలుడిని పాము కాటేసింది.ఆగ్రహించిన దీపక్.. ఆపామును రెండు చోట్ల కరిచాడు. మొదటి పాముబాలుడిని కాటేసింది. దీంతో ఆ బాలుడు ఆగ్రహానికి గురై పామును పట్టుకుని కొరికాడు. ఈ ఘటనలో పాము అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు.
సమాచారం ప్రకారం.. గార్డెన్ బ్లాక్లోని పండారపత్లో నివసిస్తున్న పహారీ కోర్వా కుటుంబానికి చెందిన 12 ఏళ్ల దీపక్ సమీపంలో నివసిస్తున్న తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. దీంతో దీపక్ కోపం వచ్చి.. వెంటనే ఆ పామును పట్టుకుని పళ్లతో కొరికాడు. పాము వెంటనే మరణించింది
ఈ ప్రాంతంలో మూఢనమ్మకాలు ఎక్కువ: దీపక్ ని పాము కరిచింది అని తెలిసిన వెంటనే సోదరి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. సకాలంలో చికిత్స అందడంతో బాలుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే పాము కాటేస్తే విషం ప్రభావం ఉండదనే మూఢనమ్మకం జష్పూర్ జిల్లాలో ఉంది. ఈ మూఢనమ్మక ప్రభావం దీపక్ పై చూపించినట్లు అందుకనే తిరిగి పాముకుని కరచినట్లు తెలుస్తోంది.
నేనూ కోపంతో కొరికానంటున్న దీపక్: తాను ఆడుకుంటుండగా విషసర్పం వచ్చి కాటేసింది అని దీపక్ రామ్ చెబుతున్నాడు. దీంతో నాకు కూడా కోపం వచ్చి పామును కొరికాను.. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకు తెలియజేశాను. వెంటనే దీపక్ ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాడు.
జష్పూర్ను నాగలోక్ అని పిలుస్తారు ఛత్తీస్గఢ్కు చివరన ఉన్న జష్పూర్ జిల్లాలోని ఫర్సాబహార్ తహసీల్ను ఆనుకుని ఉన్న ప్రాంతాలను నాగలోక్ అని పిలుస్తారు. తాచుపాములు, కట్లపాములు వంటి చాలా విషపూరితమైన పాములు స్టేట్ హైవే వెంబడి ఉన్న తప్కారా, దాని చుట్టుపక్కల గ్రామాలలో కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 70 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయని చెబుతారు. వీటిలో నాలుగు రకాల నాగుపాములు, మూడు అత్యంత విషపూరిత జాతుల క్రైట్ ఉన్నాయి అంటున్నారు. పాములను రక్షించే కేసర్ హుస్సేన్.. జష్పూర్ ప్రాంతంలో పాములు తరచుగా కనిపిస్తాయని చెప్పారు. ఛత్తీస్గఢ్లో కనిపించే అన్ని రకాల పాములలో 80% పాములు జష్పూర్లో ఉన్నాయని వారు చెప్పారు. జష్పూర్లో మొత్తం 26 రకాల పాము జాతులు కనిపిస్తాయి. వీటిలో ఆరు జాతులు మాత్రమే విషపూరితమైనవి, మిగిలిన 20 రకాల పాము జాతులలో విషం లేనివన్నారు.
జిల్లాలో మూడేళ్లలో పాముకాటుతో 35 మంది మృతి: జిల్లాలో పాములు అధికంగా ఉండడంతో పాముకాటుకు గురై చనిపోయిన కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జష్పూర్లో మూడేళ్లలో 35 మంది పాముకాటుకు గురయ్యారు. దీనికి సంబంధించిన గణాంకాలను కూడా ఆరోగ్య శాఖ విడుదల చేసింది. జిల్లాలోని అన్ని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్ వెనమ్ అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. 2017లో పాము కాటుతో 16 మంది చనిపోయారు. 2018లో పాముకాటుతో 6 మంది చనిపోగా, 2019లో 12 మంది మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..