Covid 19 vaccine: కరోనాపై పోరులో కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి వారికి ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీ..
Covid Precaution Dose: కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతీసుకుంది. శుక్రవారం నుంచి (జులై 15) నుంచి దేశ వ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోసు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఈ ప్రికాషన్ డోసును
Covid Precaution Dose: కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతీసుకుంది. శుక్రవారం నుంచి (జులై 15) నుంచి దేశ వ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోసు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఈ ప్రికాషన్ డోసును ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర కేబినేట్ తెలిపింది. అర్హులైన వారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ బూస్టర డోసును పొందవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 15 నుంచి 75 రోజుల పాటు 18- 59 ఏళ్లున్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు అందించనున్నట్లు కేంద్ర తెలిపింది. కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకన్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
India is celebrating 75 years of independence. On the occasion of Azadi ka Amrit Kaal, it has been decided that from 15th July 2022 till the next 75 days, citizens above 18 years of age will be given booster doses free of cost: Union Minister Anurag Thakur pic.twitter.com/Qai76dFVW7
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 13, 2022
#WATCH | Union Minister Anurag Thakur says, “…It has been decided that from 15th July 2022 till the next 75 days, all citizens above 18 years of age will be given booster doses free of cost…This facility will be available at all government centres…”#COVID19 pic.twitter.com/kZSOqHZQLg
— ANI (@ANI) July 13, 2022
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కరోనా వ్యాక్సినేషన్కు అర్హులైన వారిలో 96శాతం మంది ఒకడోసు తీసుకోగా.. 87శాతం మంది రెండు డోసులు పొందారు. ఇక ప్రికాషన్ డోసును మాత్రం 18 నుంచి 59ఏళ్ల వయసు వారికి అది కూడా కేవలం ప్రైవేటు సెంటర్లలోనే పంపిణీ చేస్తున్నారు. కాగా దేశంలో 77కోట్ల మంది ఈ వయసు వారు ఉండగా అందులో కేవలం ఒకశాతం మాత్రమే ఇప్పటివరకు బూస్టర్ డోసును తీసుకున్నారు. 60ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్నారు. వీరి సంఖ్య 16కోట్లు ఉండగా వారిలో 26శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించిన సంగతి కూడా తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..