5G Technology: ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదు.. భారత్‌‌పై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు..

భారతదేశం కంటే సమగ్రమైన డిజిటల్ ఇన్‌ఫ్రాను ఇప్పటివరకు ఏ దేశం నిర్మించలేదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మెన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు.

5G Technology: ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదు.. భారత్‌‌పై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు..
Ashwini Vaishnaw - Bill Gates

Updated on: Mar 01, 2023 | 5:57 PM

భారతదేశం కంటే సమగ్రమైన డిజిటల్ ఇన్‌ఫ్రాను ఇప్పటివరకు ఏ దేశం నిర్మించలేదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మెన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. ప్రపంచంలో అతి చౌకైన 5జీ నెట్‌వర్క్ మార్కెట్ భారతదేశంలోనే అందుబాటులో ఉంటుందని చెప్పేందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదని కొనియాడారు. భారత్ లో పర్యటిస్తున్న బిల్ గేట్స్ పలువురు ప్రముఖులతో వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం భారత టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థిరమైన ఆవిష్కరణలను నడపడంలో ప్రమాణాలు, ప్లాట్‌ఫారమ్‌ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన బిల్ గేట్స్.. భారత్ ఈ విషయంలో ముందంజలో ఉందని తెలిపారు. ఆవిష్కరణలు, అప్లికేషన్‌లకు చోటు కల్పించిన బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను భారతదేశం ఏర్పాటు చేసిందని.. ఇది అద్భుతం అంటూ బిల్ గేట్స్ ప్రశంసించారు.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ COVID-19 తర్వాత మొదటిసారి భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లను మంగళవారం కలిశారు. బుధవారం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ పరంగా భారత్ చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. యూపీఐ, ఆధార్ లాంటి సంస్కరణల గురించి ప్రశంసలు కురిపించారు. వైద్య పరంగా తీసుకువస్తున్న సంస్కరణలు అద్భుతమంటూ కొనియాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us