AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ రూమ్‌లో దొరికిన జంట.. పోలీస్ స్టేషనే పెళ్లి వేదిక.. ప్రియురాలు హ్యాపీ.. ప్రియుడు షాక్!

బీహార్ రాజధాని పాట్నాలో ఒక విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై స్టేషన్ ప్రాంగణంలోని గుడిలోనే వారికి పెళ్లి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వివాహం ఇద్దరి మధ్య సమ్మతితో జరిగినట్లు కాకుండా, ఒకరికి పరమానందం, మరొకరికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.

హోటల్ రూమ్‌లో దొరికిన జంట.. పోలీస్ స్టేషనే పెళ్లి వేదిక.. ప్రియురాలు హ్యాపీ.. ప్రియుడు షాక్!
Marriage In Police Station
Balaraju Goud
|

Updated on: May 21, 2026 | 8:55 AM

Share

బీహార్ రాజధాని పాట్నాలో ఒక విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై స్టేషన్ ప్రాంగణంలోని గుడిలోనే వారికి పెళ్లి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వివాహం ఇద్దరి మధ్య సమ్మతితో జరిగినట్లు కాకుండా, ఒకరికి పరమానందం, మరొకరికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.

నవాడా జిల్లాకు చెందిన రాజేష్, సవిత (పేర్లు మార్చబడ్డాయి) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. సుమారు వారం క్రితం వీరిద్దరూ తమ ఇళ్ల నుంచి పారిపోయి పాట్నా చేరుకున్నారు. బుధవారం (మే 20) ఉదయం, అమ్మాయి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జక్కన్‌పూర్ పోలీసులు మిథాపూర్ పాత బస్ స్టాండ్ సమీపంలోని ఒక హోటల్‌పై దాడి చేసి వీరిని పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ఇరు కుటుంబాల సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు.

పోలీస్ స్టేషన్ లోపల దాదాపు నాలుగు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యువకుడు పెళ్లికి ససేమిరా అనగా, యువతి కుటుంబ సభ్యులు మాత్రం పట్టుబట్టారు. “తమ కుమార్తె ఇన్ని రోజులు అతడితో కలిసి హోటల్‌లో గడిపిన తర్వాత, ఆమెను మరెవరూ పెళ్లి చేసుకోరు” అని వారు వాదించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో, పోలీసులు జోక్యం చేసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. చివరకు పోలీసుల సమక్షంలోనే వివాహం జరిపించాలని నిర్ణయించారు.

ఢిల్లీలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న రాజేష్, తాను బలవంతపు పెళ్లికి బాధితుడినని ఆరోపించాడు. సవిత తన ఇష్టప్రకారమే తనతో కలిసి ఉందని, పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చి ఈ పెళ్లి చేశారని అతడు వాదిస్తున్నాడు. సవిత మాత్రం ఈ వివాహంతో ఉప్పొంగిపోతోంది. రాజేష్ తనను ఇంటి నుంచి అపహరించి పాట్నా తీసుకువచ్చాడని, ఐదేళ్లుగా తమ మధ్య సంబంధం ఉందని ఆమె పేర్కొంది. ఈ పెళ్లి తమ బంధానికి ఒక పవిత్రతను ఇచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న మనోకామ్నా ఆలయంలో పురోహితుడు విద్యాధర్ శుక్లా శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. పోలీసుల నుంచి సమాచారం రావడంతో, ఇద్దరూ వయోజనులే అని నిర్ధారించుకున్నాక, కుటుంబ సభ్యుల సమక్షంలోనే తాను ఈ క్రతువు పూర్తి చేసినట్లు పూజారి తెలిపారు. ఇది చట్టవిరుద్ధంగా జరిగిన బలవంతపు పెళ్లి అని వరుడు అంటుంటే, “నా జీవిత కాల స్వప్నం” అని వధువు చెబుతోంది. సాధారణంగా నేరస్థులతో కళకళలాడే పోలీస్ స్టేషన్, ఇలా ఒక వింత పెళ్లికి వేదిక కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. చట్టం దృష్టిలో ఇద్దరూ మేజర్లు అయినప్పటికీ, వరుడి అసంతృప్తి ఈ వివాహం చుట్టూ కొత్త వివాదానికి తెరలేపింది.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us