
మనం ఎప్పుడూ వింటూ ఉంటాం.. భారత్ ఇప్పుడు ప్రపంచానికే స్టార్టప్ హబ్ అని. ఆ మాటను నిజం చేస్తూ, భారతీయ విశ్వవిద్యాలయాల్లో పుట్టిన వినూత్న ఆలోచనలను ప్రపంచ మార్కెట్కు పరిచయం చేయడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ అనే భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ముందుగా, పారిస్లో నిర్వహించిన రోడ్షో ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నైస్ నగరంలో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ఈ రోడ్షో ఒక టీజర్ లాంటిది. భారత రాయబార కార్యాలయం, సీఐఐ సహకారంతో జరిగిన ఈ సమావేశంలో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ బిజినెస్ నెట్వర్క్లు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. భారతదేశంలోని డీప్-టెక్ స్టార్టప్లను అంతర్జాతీయ పెట్టుబడిదారులతో అనుసంధానం చేయడమే ఈ రోడ్షో ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా విద్యా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీలు కె.ఎం. ప్రఫుల్లచంద్ర శర్మ, గోవింద్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ముఖ్యంగా సెమీకండక్టర్లు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ వంటి 13 అత్యాధునిక సాంకేతిక రంగాలపై ఈ ఈవెంట్ ఫోకస్ చేయనుంది. గత ఫిబ్రవరిలో భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి ‘భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్’ను ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మన కాలేజీల్లోని ల్యాబ్ల నుండి పుట్టిన ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, గ్లోబల్ ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలు నైస్ నగరంలో జరగబోయే సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ రోడ్షో ద్వారా భారతీయ స్టార్టప్ల శక్తి సామర్థ్యాలపై ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లలో గట్టి నమ్మకం ఏర్పడింది.
The Ministry of Education organised a Bharat Innovates 2026 Pre-Event Roadshow in Paris, bringing together global investors, corporates, universities, and research institutions to strengthen international innovation partnerships.
The roadshow showcased India’s rapidly growing… pic.twitter.com/QE3JZih2NV
— Ministry of Education (@EduMinOfIndia) May 6, 2026