ప్రేమించాడనీ.. విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువతి తండ్రి!

|

Jul 17, 2023 | 7:15 AM

తమ కుమార్తెను ప్రేమించాడనే నెపంతో 18 ఏళ్ల విద్యార్థిపై యువతి తండ్రి, బంధువులు పెట్రోల్‌ పోసి సజీవ దహనానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన విద్యార్ధి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ఉదయం కన్ను..

ప్రేమించాడనీ.. విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువతి తండ్రి!
Shashank
Follow us on

బెంగళూరు, జులై 17: తమ కుమార్తెను ప్రేమించాడనే నెపంతో 18 ఏళ్ల విద్యార్థిపై యువతి తండ్రి, బంధువులు పెట్రోల్‌ పోసి సజీవ దహనానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన విద్యార్ధి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ఉదయం కన్నుమూశాడు. తమ కూతురితో ప్రేమాయణం సాగించడమే ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ షాకింగ్‌ ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే..

బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శశాంర్‌ను శనివారం ఉదయం 8 గంటలకు అతని తండ్రి రంగనాథ్ కాలేజీ వద్ద దింపివెళ్లాడు. ఐతే ఆ రోజు క్లాస్‌లేవీ లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న శశాంక్‌ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ సమీపంలో బెంగళూరు-మైసూరు రహదారి వైపు నడుచుకుంటూ వెళుతుండగా.. టయోటా ఇన్నోవాలో వచ్చిన దుండగుల ముఠా శశాంక్‌ను వాహనంలో అపహరించి తీసుకెళ్లారు. వాహనంలో తాను ప్రేమించిన యువతి తండ్రితో సహా మొత్తం ఏడుగురు ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు.

అతని కళ్లకు గంతలు కట్టి, తన కూతురినే ప్రేమిస్తావా అంటూ మామ దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. ఆ తర్వాత దుండగులు శశాంక్‌ను సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లారు. శరీరమంతా మంటలు అనంతరం మంటలను ఆర్పడానికి నేలపై దొర్లానని, మట్టి కూడా చల్లుకున్నానని బాధితుడు తెలిపాడు. అనంతరం తన మొబైల్ నుంచి బంధువు హీరాకి కాల్ చేయగా.. ఆమె నా స్నేహితులు సరస్వతి, కుమార్‌తో వచ్చి తనను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులకు తెలిపాడు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహానా పాటిల్‌ అండ్‌ టీమ్‌ అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, యువతి తండ్రితో పాటు మరో ఆరుగురిపై కిడ్నాప్, దాడి, హత్యాయత్నం కేసులను నమోదు చేశారు. ప్రస్తుతం శశాంక్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.