బెంగాల్‌ను టార్గెల్ చేసిన కాషాద దళం.. డిసెంబర్ 20న ప్రధాని మోదీ పర్యటన!

భారతీయ జనతా పార్టీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 20న పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. తన పర్యటన సందర్భంగా, ఆయన ఒక పెద్ద బహిరంగ సభలో పాల్గొని, నదియా జిల్లాలో జరిగే భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

బెంగాల్‌ను టార్గెల్ చేసిన కాషాద దళం.. డిసెంబర్ 20న ప్రధాని మోదీ పర్యటన!
Pm Narendra Modi, Mamata Banerjee

Updated on: Dec 05, 2025 | 2:12 PM

భారతీయ జనతా పార్టీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 20న పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. తన పర్యటన సందర్భంగా, ఆయన ఒక పెద్ద బహిరంగ సభలో పాల్గొని, నదియా జిల్లాలో జరిగే భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ సమయంలో ప్రధాని మోదీ బెంగాల్ బీజేపీ సీనియర్ నాయకులతో సమావేశమవుతారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై వివరణాత్మక చర్చలు జరుపుతారని వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో నాలుగు నుండి ఆరు పరివర్తన్ యాత్రలను ప్రారంభించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. వీటిలో ఒకదానిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.

మమతా బెనర్జీని ఇరుకున పెట్టడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ మాత్రమే కాకుండా, పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా బెంగాల్ పర్యటనను ప్రారంభించనున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా జనవరి నుండి పశ్చిమ బెంగాల్‌లో మకాం వేస్తారు. బూత్ నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ గ్రౌండ్ లెవల్ సన్నాహాలను ఆయన సమీక్షిస్తారు. పార్టీ విధానాలను మరింత బలోపేతం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు దాని మొత్తం వ్యూహాన్ని ఖరారు చేస్తారు. శాంతిభద్రతలు, అవినీతి, మహిళల భద్రత, సరిహద్దు చొరబాటు వంటి కీలక అంశాలను బీజేపీ ప్రస్తావించనుంది. పార్టీ అనేక ఇతర ప్రాంతీయ అంశాలపై కూడా దృష్టి సారిస్తోంది.

ఇదిలావుంటే, ఎన్నికలకు ముందు బెంగాల్‌లో నిర్వహిస్తున్న SIRపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. SIR ద్వారా బీజేపీ ఎన్నికలను రిగ్గింగ్ చేసిందని మమతాతోపాటు ఇతర ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా, ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని ఆమె ఆరోపించారు. కాగా, 294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 మార్చి-ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 7, 2026న ముగుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us