Azadi Ka Amrit Mahotsav: దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు.. ఒక్క తాజ్‌మహల్‌లో తప్ప.. ఎందుకో తెలుసా?

|

Aug 10, 2022 | 1:05 PM

Azadi Ka Amrit Mahotsav: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ మైలురాయికి గుర్తుగా దేశ వ్యాప్తంగా..

Azadi Ka Amrit Mahotsav: దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు.. ఒక్క తాజ్‌మహల్‌లో తప్ప.. ఎందుకో తెలుసా?
Taj Mahal
Follow us on

Azadi Ka Amrit Mahotsav: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ మైలురాయికి గుర్తుగా దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలను భారత జెండా త్రివర్థ పతాకం రంగుల థీమ్‌తో లైగింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన కూడళ్లు, పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. అయితే, దేశంలో ఎక్కడ ఏం చేసినా.. తాజ్ మహల్‌కు మాత్రం నైట్ లైటింగ్ అస్సలు పెట్టరు. ఇందుకు ప్రత్యేకమైన, బలమైన కారణం ఒకటుంది. మరి తాజ్ మహల్‌కు ఎందుకు లైటింగ్ పెట్టరు? దానివెనకున్న కారణమేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలోనే లైటింగ్ ఏర్పాటు చేయని ఏకైకా చారిత్రక కట్టడం తాజ్ మహల్. ఏ సంబరమైనా.. తాజ్ మహల్‌కు మాత్రం మినహాయింపు ఉంటుంది. దానికి ప్రత్యేక కారణం ఉంది. ఆగ్రాలోని టూరిస్ట్ వెల్ఫేర్ ఛాంబర్ ఎడిటర్ విశాల్ శర్మ దీని వెనుక గల కారణాన్ని వివరించారు. 77 సంవత్సరాల క్రితం మిత్రరాజ్యాల దళాలు రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించగా.. ఆ విజయానికి గుర్తుకుగా భారత్‌లోనూ సంబరాలు నిర్వహించారు. ఆ సందర్భంగా తాజ్ మహల్‌కు ప్రత్యేకంగా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత మార్చి 20, 1997లో ప్రఖ్యాత పియానిస్ట్ యాన్ని ప్రదర్శన కోసం తాజ్ మహల్‌కు ప్రత్యేకంగా లైటింగ్ పెట్టారు. అయితే, ప్రదర్శన తరువాత మరుసటి రోజు ఉదయం, అక్కడంతా చనిపోయిన కీటకాలు కనిపించాయి. ఈ ఘటన తరువాత భారత పురావస్తు శాఖ కెమికల్ వింగ్.. తాజ్ మహల్‌ను రాత్రిపూట లైటింగ్ ఏర్పాటు చేయొద్దని సూచించింది. లైటింగ్ కారణంగా కీటకాలు వాలడం, తాజ్ మహల్ గోడలు, ఉపరితలపై మరకలు అవుతున్నాయి. ఇది పాలరాయిని మరింత క్షీణింపజేస్తుందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. అలా నాటి నుంచి ఇప్పటి వరకు తాజ్‌మహల్‌కు విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడంలేదు.

అయితే, ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది. లైటింగ్ విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ తాజ్ మహల్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని పురావస్తు శాఖ తేల్చి చెబుతోంది. ఇదిలాఉంటే.. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశీయ, విదేశీ సందర్శకులకు ఆగస్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ దరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, మ్యూజియంలకు ప్రవేశాన్ని ఉచితం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సర్కార్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..