బీహార్ ‘మాంజీ’ కి ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ కానుక

| Edited By: Pardhasaradhi Peri

Sep 22, 2020 | 5:30 PM

బీహార్ లోని గయ జిల్లా లాతువా గ్రామానికి చెందిన మాంజీ (కెనాల్ మ్యాన్) లోంగి భూయాన్ కృషి ఫలిచింది. ఎండిపోతున్న తన పొలానికి వాన నీటిని మళ్లించేందుకు ఈ పేద రైతు 30 సంవత్సరాల పాటు..

బీహార్ మాంజీ కి ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ కానుక
Follow us on

బీహార్ లోని గయ జిల్లా లాతువా గ్రామానికి చెందిన మాంజీ (కెనాల్ మ్యాన్) లోంగి భూయాన్ కృషి ఫలిచింది. ఎండిపోతున్న తన పొలానికి వాన నీటిని మళ్లించేందుకు ఈ పేద రైతు 30 సంవత్సరాల పాటు ఎండనక, వాననక కష్టపడి మూడు కి.మీ. కాలువ తవ్వాడు. ఈ రైతు కథనం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కదిలించింది. భూయాన్ కి ఆయన సరికొత్త ట్రాక్టర్ ను బహుకరించారు. మాంజీ తవ్విన కాలువ తాజ్ లేదా ఈజిప్ట్ పిరమిడ్లకన్నా అత్యద్భుత ‘మాన్యుమెంట్’ అని అభివర్ణించారు. ఈ ట్రాక్టర్ ను బహుకరించడం ద్వారా భూయాన్ ని గౌరవించాలనుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ అపూర్వ స్పందన నేపథ్యంలో  బీహార్ లోని మహీంద్రా గ్రూప్ ఉద్యోగులు, డీలర్ పార్ట్ నర్ కూడా ఈ ట్రాక్టర్ వద్ద భూయాన్ నిలబడిన ఫోటోను షేర్ చేశారు. తనకు లభించిన ఈ బహుమానం పట్ల భూయాన్ అమితానందం వ్యక్తం చేశాడు.