దేశ రాజధానిలో ఉగ్ర అలజడి.. దాడులకు జైషే ప్లాన్..?

| Edited By:

Oct 03, 2019 | 12:32 PM

దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డట్లు నిఘా వర్గాలు హెచ్చిరికలు జారీ చేశాయి. పెద్ద ఎత్తున ఆయుధాలతో వారు ఢిల్లీ నగరంలోకి చేరారని.. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అలర్ట్ చేసింది. నిఘా వర్గాల హెచ్చిరికలతో పోలీసులు ఢిల్లీ నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ […]

దేశ రాజధానిలో ఉగ్ర అలజడి.. దాడులకు జైషే ప్లాన్..?
Follow us on

దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డట్లు నిఘా వర్గాలు హెచ్చిరికలు జారీ చేశాయి. పెద్ద ఎత్తున ఆయుధాలతో వారు ఢిల్లీ నగరంలోకి చేరారని.. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అలర్ట్ చేసింది. నిఘా వర్గాల హెచ్చిరికలతో పోలీసులు ఢిల్లీ నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. హోటళ్లు, లాడ్జ్‌లు, మార్కెట్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మొహరించారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇప్పటికే పలుమార్లు నిఘా వర్గాలు హెచ్చిరంచాయి.