‘అమావాస్య’పై వెరైటీ ట్వీట్.. నెటిజన్స్ జోక్స్.. డిలీట్ చేసిన అమితాబ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఈ సారి ' కరోనా' నేపథ్యంలో పప్పులో కాలేశారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు,
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఈ సారి ‘ కరోనా’ నేపథ్యంలో పప్పులో కాలేశారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని ప్రజలంతా చప్పట్లతో అభినందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మార్చి 22 వ తేదీ.. ఆదివారం అమావాస్య అయిందని, ఆ రోజున ఇలా చప్పట్లు కొడితేనో, శంఖాలు ఊదితేనో కరోనా వైరస్ వంటి బ్యాక్టీరియా, దుష్ట శక్తులు నశిస్తాయని, ఆ రోజున చంద్రుడు రేవతీ నక్షత్రంలో ప్రవేశిస్తాడని అమితాబ్ ట్వీట్ చేశారు. కానీ ఆయన చేసిన ఈ ట్వీట్ సంచలనం రేపింది. ఆయనది అశాస్త్రీయమైన ఆలోచన అని, ఈ రోజుల్లో కూడా ఈ విధమైన మూఢ నమ్మకాలేమిటని అనేకమంది నెటిజన్లు ఆయనతో ‘ ఓ ఆటాడుకున్నారు’. దీంతో ఆయన తన ట్వీట్ ను డిలిట్ చేశారు. ఏమైనా ఇది తన ప్రకటన కాదని, ఇది డిస్ క్లైమర్ అని ఆ తరువాత ఆయన పేర్కొన్నారు.