Indian Navy: నడి సముద్రంలో ప్రాణాపాయస్థితిలో పాకిస్థానీలు.. ఉపిరి పోసిన భారత నావికాదళం

అరేబియా సముద్రంలో ఇతర దేశాలకు భారత నావికాదళం నిరంతరం సహాయం అందిస్తోంది. కొన్నిసార్లు పైరేట్స్ కారణంగా, మరికొన్నిసార్లు మెడికల్ ఎమర్జెన్సీలో, ఏ పరిస్థితిలోనైనా సమాచారం అందిన వెంటనే బృందం అవసరమైన సహాయం అందిస్తోంది. అలాంటి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో, అత్యవసర కాల్‌కు స్పందించిన భారత నావికాదళం, 20 మంది పాకిస్తానీ సిబ్బందితో కూడిన ఇరాన్ ఫిషింగ్ నౌకకు వెంటనే వైద్య సహాయం అందించింది.

Indian Navy: నడి సముద్రంలో ప్రాణాపాయస్థితిలో పాకిస్థానీలు.. ఉపిరి పోసిన భారత నావికాదళం
Indian Navy
Follow us

|

Updated on: May 04, 2024 | 3:21 PM

అరేబియా సముద్రంలో ఇతర దేశాలకు భారత నావికాదళం నిరంతరం సహాయం అందిస్తోంది. కొన్నిసార్లు పైరేట్స్ కారణంగా, మరికొన్నిసార్లు మెడికల్ ఎమర్జెన్సీలో, ఏ పరిస్థితిలోనైనా సమాచారం అందిన వెంటనే బృందం అవసరమైన సహాయం అందిస్తోంది. అలాంటి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో, అత్యవసర కాల్‌కు స్పందించిన భారత నావికాదళం, 20 మంది పాకిస్తానీ సిబ్బందితో కూడిన ఇరాన్ ఫిషింగ్ నౌకకు వెంటనే వైద్య సహాయం అందించింది.

భారత నావికాదళం శనివారం (మే 4, 2024) ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యవసర కాల్‌కు వెంటనే స్పందించి, అరేబియా సముద్రంలో పైరసీని నిరోధించడానికి మోహరించిన INS సుమేధ మిషన్, ఇరాన్ నౌకకు కీలకమైన వైద్య సహాయం అందించింది. ఈ నౌకలో 20 మంది పాకిస్థానీ సిబ్బంది ఉన్నారు.

అంతకు ముందు పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమేధ ఏప్రిల్ 30న ఈ సహాయాన్ని అందించిందని నేవీ తెలిపింది.ఇక తాజాగా తెల్లవారుజామున FV అల్ రహ్మానీ అనే ఇరాన్‌కు చెందిన నౌకలో ప్రయాణిస్తున్న సిబ్బంది ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న భారత నావీదళం అఘమేఘాల మీద ఇరాన్ నౌక వద్దకు చేరుకుని సహాయం అందించారు. వైద్య నిపుణుల బృందంలో ఒకరు ఇరాన్ నౌకలో ఎక్కి సిబ్బందికి తక్షణ వైద్య సహాయం అందించారు. అరేబియా సముద్రంలో మోహరించిన భారత నావికాదళ యూనిట్లు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న నావికుల భద్రత, సహాయం పట్ల తమ దృఢ నిబద్ధతకు ప్రతీక అని వైమానిక దళం తన ప్రకటనలో పేర్కొంది.

గతంలో తన గొప్ప మనస్సును చాటుకుంది ఇండియన్ నావీ. మార్చి నెలలో సోమాలియా సమీపంలో సాయుధ సముద్రపు దొంగలు కిడ్నాప్ చేసిన ఇరాన్ ఫిషింగ్ ఓడలోని 23 మంది సభ్యుల సిబ్బందిని భారత నావికాదళం విజయవంతంగా రక్షించింది. యెమెన్‌లోని సోకోత్రాకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో మార్చి 28న అల్-కంబర్ 786 అనే ఓడను తొమ్మిది మంది సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. దీని తర్వాత, INS సుమేధ, INS త్రిశూల్ 12 గంటలకు పైగా కార్యకలాపాలు నిర్వహించి, సముద్రపు దొంగలను బలవంతంగా లొంగిపోయేలా చేశాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles